Share News

PM Modi: తమిళనాడులో మళ్లీ ప్రధాని పర్యటన

ABN , Publish Date - Jul 31 , 2025 | 10:16 AM

ప్రధాని నరేంద్రమోదీ మళ్ళీ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 26 ప్రధాని మోదీ తూత్తుకుడిలో పునర్నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభించి, మరుసటి రోజు గంగైకొండచోళపురం రాజేంద్రచోళుడి జయంత్యుత్సవాల్లో పాల్గొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ రాష్ట్రానికి విచ్చేయనున్నారు.

PM Modi: తమిళనాడులో మళ్లీ ప్రధాని పర్యటన

- తిరువణ్ణామలై, చిదంబరం ఆలయాల సందర్శన

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ మళ్ళీ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 26 ప్రధాని మోదీ తూత్తుకుడిలో పునర్నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభించి, మరుసటి రోజు గంగైకొండచోళపురం రాజేంద్రచోళుడి జయంత్యుత్సవాల్లో పాల్గొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఆగస్టు 26 నుంచి 27 వరకు ఆయన తిరువణ్ణామలై, కడలూరు(Tiruvannamalai, Cuddalore) జిల్లాల్లో పర్యటించనున్నారు.


nani2.2.jpg

ఆ సందర్భంగా తిరువణ్ణామలై ఆలయాన్ని సందర్శించి, ఆ తర్వాత కడలూరు జిల్లా చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ ఆలయం నుంచే మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలోనూ పాల్గొననున్నారు. ఇదే విధంగా సెప్టెంబర్‌ లోనూ మోదీ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.


nani2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2025 | 10:16 AM