PM Modi: విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అజిత్ దోవల్, జైశంకర్తో మోడీ అత్యవసర భేటీ
ABN , Publish Date - Apr 23 , 2025 | 08:08 AM
పహల్గామ్లో ఉగ్రవాద ఘటన నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. తన సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని తాజాగా ఢిల్లీకి తిరిగొచ్చారు. ఆ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే, ఆయన అక్కడే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు.

సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టారు. ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే, ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, నాయకులు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్టులు, కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాలు, ఈ దాడి దౌత్యపరమైన పరిణామాలపై లోతైన చర్చలు జరిపారని ఆయా వర్గాలు తెలిపాయి.
తక్షణమే స్పందన
ప్రధానమంత్రి మోదీ ఈ సంక్షోభ సమయంలో వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం ద్వారా దేశ భద్రతపై తన పటిష్ఠమైన నిబద్ధతను మరోసారి నిరూపించారు. ఈ సమావేశంలో, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, బాధితులకు సహాయం అందించడం, ఈ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ తక్షణ స్పందన దేశ ప్రజలకు భరోసాను ఇస్తోందని చెప్పవచ్చు. ఈ సమావేశం ద్వారా, భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తన సంసిద్ధతను, దృఢ నిశ్చయాన్ని కల్కి ఉందని స్పష్టం చేసింది.
ప్లాన్ ప్రకారమే చేశారా..
ఈ ఉగ్రదాడి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఈ దాడి ముందుగానే ప్రణాళిక ప్రకారం జరిపారని అనుమానిస్తున్నారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై దేశ ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ దాడిని ఖండించి, ఇండియాకు మద్దతుగా నిలిచాయి. దీంతోపాటు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడి.. భారత్కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం
PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News