Share News

PM Modi: కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్ధేశం

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:28 PM

PM Modi: రానున్న రోజుల్లో భారత్ పెద్ద వ్యాపార, వాణిజ్య దేశంగా మారబోతోందని, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్ర మంత్రులంతా విధిగా ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు గడపాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi: కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్ధేశం
PM Modi Directs Union Ministers

PM Modi: మంత్రులు మరింత మెరుగైన పాలన అందించడంపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర మంత్రులకు (Union Ministers) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిశా నిర్దేశం (Instructions) చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రిమండలి సమావేశం (Cabinet Meeting)లో కీలక వ్యాఖ్యలు (Key Census) చేశారు. బుధవారం దాదాపు నాలుగు గంటల పాటు కేంద్ర మంత్రి మండలి సమావేశం సాగింది. ఈ సందర్భంగా మోదీ మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. మన ముందు పెద్ద లక్ష్యాలు వున్నాయని... సమయం మాత్రం పరిమితంగానే ఉందని చెప్పారు. కాగా మంత్రిమండలి సమావేశానికి ముందు జన, కులగణన షెడ్యూల్‌ను కేంద్ర హోం శాఖ ప్రకటించింది. జన, కులగణనతో ముడిపడే నియోజకవర్గాల పునర్ విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


భారత్ పెద్ద వ్యాపార, వాణిజ్య దేశంగా..

రానున్న రోజుల్లో భారత్ పెద్ద వ్యాపార, వాణిజ్య దేశంగా మారబోతోందని, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్ర మంత్రులంతా విధిగా ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు గడపాల్సిందేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాల్లో వస్తున్న ఫలితాలపై ప్రధానంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని, 11 ఏళ్ళ పాలన, ప్రభుత్వం సాధించిన విజయాలపై కేబినెట్ కార్యదర్శి స్వామి నాథన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే వైద్య, నీటి వనరుల శాఖలపై ఆరోగ్య కార్యదర్శి పూన్య శ్రీవాస్తవ, జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ప్రజెంటేషన్ ఇచ్చారు. రహదారులు సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఆ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు.


నీతి అయోగ్ నివేదిక..

ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో మంత్రుల పనితీరుపై నీతి అయోగ్ నివేదిక ఇచ్చింది. నిర్దేశించిన మేరకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో పర్యటించని 5 గురు కేంద్ర మంత్రుల పేర్లను నీతి అయోగ్ సిఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రస్తావించారు. మంత్రులు తప్పని సరిగా పర్యటించాలని కనీసం ఒక్క రోజైనా సంబంధిత జిల్లా, బ్లాక్‌లో గడపాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రజలతో మమేకం కావాలి అంటే ఇది తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ ప్రాజెక్టులు లక్ష్యాలు సాధించాలని, గత 10 ఏళ్ళ పాలన సాధించిన విజయాలు అంతకుముందు 10 ఏళ్ళ ప్రభుత్వాలతో పోల్చుకోవద్దని అన్నారు.


అనేక భారీ లక్ష్యాలను సాధించాలి...

రానున్న రోజుల్లో అనేక భారీ లక్ష్యాలను సాధించాలని ప్రధాని మోదీ మంత్రులకు సూచించారు. నీటి సంరక్షణకు కార్యక్రమాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ఉపయోగించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన గ్రామీణ పథకంకు ప్రస్తుతం ఉపాధి హామీ పథకం నిధుల వినియోగిస్తారన్నారు. అనేక రుగ్మతలకు కారణం స్థూల కాయమని, స్థూలకాయం, ఊబ కాయంకు వంట నూనెల వినియోగమే ప్రధాన కారణంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రజలు రోజు వారీ ఆహార వినియోగంలో కనీసం 10 శాతం వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో భారత్ పెద్ద వ్యాపార దేశంగా మార బోతోందని అందుకు అనుగుణంగా ఉత్పత్తుల నాణ్యత, మెరుగైన పాలన అవసరం అని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు రెండితలు అయిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు.


కరుణామయ ప్రభుత్వం..

ఎన్డీయే ప్రభుత్వం పేదల సంక్షేమానికే అంకితమైన కరుణామయ ప్రభుత్వమని, కీలక పథకాలన్నీ పేదల జీవితాలను మార్చాయని, గత దశాబ్దంలో ఎన్డీయే ప్రభుత్వం సాధికారత, మౌలిక సదుపాయాలు, సమ్మిలితత్వంపై దృష్టి సారించి, పేదరికం నుంచి అనేక మందిని బయటకు తీసుకురావడానికి విప్లవాత్మక చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన , ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు గృహనిర్మాణం, వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచాయన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రయత్నాలతో, అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశం అనే లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధిస్తామని తనకు నమ్మకం ఉందని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధి దిశగా చేస్తున్న ప్రయత్నాలు పరివర్తనాత్మక ఫలితాలకు దారితీశాయని పేదలు అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్

అంబటి రాంబాబుపై కేసు నమోదు

For More AP News and Telugu News

Updated Date - Jun 05 , 2025 | 12:28 PM