Share News

Mallikarjun Kharge: ఉగ్రదాడి సమాచారంతోనే మోదీ కశ్మీర్ ట్రిప్ రద్దయింది: ఖర్గే

ABN , Publish Date - May 06 , 2025 | 04:30 PM

జార్ఖాండ్‌లోని రాంచీలో మంగళవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావ్' ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని చెప్పారు.

Mallikarjun Kharge: ఉగ్రదాడి సమాచారంతోనే మోదీ కశ్మీర్ ట్రిప్ రద్దయింది: ఖర్గే

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. హహల్గాం ఉగ్రదాడి ఘటనకు మూడు రోజులకు ముందే ఇంటెలిజెన్స్ సమాచారం అందడటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. జార్ఖాండ్‌లోని రాంచీలో మంగళవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావ్' ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని చెప్పారు.

India-pakistan tensions: పాత బంకర్లను పునురుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ


''ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. ప్రభుత్వం కూడా దీనిని అంగీకరించింది. ఇంటెలిజెన్స్‌ పటిష్టం చేసుకుంటామని వాళ్లే చెప్పారు. అయితే దాడికి మూడు రోజుల ముందే ప్రధానికి నిఘా సమాచారం అందినట్టు నాకు తెలిసింది. దాంతోనే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని వార్తా పత్రికల్లో కూడా చూశాను'' అని ఖర్గే అన్నారు. ముందే నిఘా సమాచారం ఉన్నప్పుడు పహల్గాంలో మరింత భద్రత ఎందుకు చేపట్టలేకపోయారని ఆయన ప్రశ్నించారు. నిఘా వైఫల్యం ఉందని ఒప్పుకున్నప్పడు పహల్గాం ఉగ్రదాడిలో పలువురు ప్రాణాలు కోల్పోతే అందులో కేంద్రానికి బాధ్యత లేదా? అని నిలదీశారు.


పహల్గాం దాడికి వ్యతిరేకేంగా పాకిస్థాన్‌పై ఎలాంటి చర్య తీసుకున్నా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని ఖర్గే మరోసారి స్పష్టం చేశారు. అన్నింటికంటే దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో టూరిస్టులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఘటన వెనుక పాక్ ప్రమేయం ఉందనడానికి సాక్ష్యాలున్నాయంటూ ఆ దేశంపై భారత్ వరుస కఠన నిర్ణయాలు తీసుకుంది. పౌక్ పౌరులను వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించడంతో పాటు కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.


ఇవి కూడా చదవండి

Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు

Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం

For National News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:45 PM