Share News

Padma Awards 2025 : రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మా పురస్కారాల ప్రదానోత్సవం

ABN , Publish Date - May 27 , 2025 | 06:21 PM

రాష్ట్రపతి భవన్‌లో పద్మా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Padma Awards 2025 : రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మా పురస్కారాల ప్రదానోత్సవం
Padma Awards 2025

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో పద్మా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మంద కృష్ణ మాదిగ, కెఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి తదితరులు పద్మ అవార్డులు అందుకోనున్నారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ వంటి విభిన్న రంగాలలో విశేష సేవలు అందించిన వారికి పౌర పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.


మొత్తం 139 మందిని కేంద్రం ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏడు పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా 71 మంది ప్రముఖులకు ఈ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. రెండవ విడతలో భాగంగా 68 మందికి పద్మా పురస్కారాలు అందజేశారు. కాగా, ఇవాళ(మంగళవారం) ముగ్గురు పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా.. మరో తొమ్మిది మంది పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అలాగే, మరో 56 మంది పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.

Updated Date - May 27 , 2025 | 06:34 PM