Chennai: రూ.4.98 లక్షలకు ఊటీ కొండ రైలు అద్దెకు..
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:51 AM
ఊటీ కొండరైలును అధికారులు అద్దెకిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు అద్దెకివ్వడం ద్వారా సంస్థకు ఆర్ధికంగా లాభం కూడా చేకూరుతోంది. ఓ పాఠశాల విద్యార్థులకు రూ.4.98 లక్షలతో కొండ రైలును అద్దెకిచ్చారు.

చెన్నై: నీలగిరి జిల్లా ఊటీ(Ooty)కి వచ్చే ప్రయాణికులు కొండ రైలు(Hill Train)లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాగే, కున్నూరు-ఊటీ, మేట్టుపాళయం మధ్య నడుపుతున్న కొండ రైలును విదేశీ పర్యాటకులు అద్దెకు తీసుకుని ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో, కోవైలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించింది.
ఈ వార్తను కూడా చదవండి: Sikkim: సిక్కింలో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు..
ఈ పోటీల్లో సుమారు 90 మంది విద్యార్థినీ, విద్యార్థులు గెలుపొందారు. వారికి బహుమతిగా కొండ రైలులో ప్రయాణం చేయించారు. అందుకోసం ఆ సంస్థ నిర్వాహకులు రూ.4.98 లక్షలతో కొండ రైలు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ రైలు ప్రయాణంతో విద్యార్థులు ఆనందోత్సహాల్లో మునిగిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆన్లైన్లో అవకాడోలు బుక్ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా
మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..
Read Latest Telangana News and National News