Share News

Minister: కొవిడ్‌పై భయాందోళనలు వద్దు

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:01 PM

కొవిడ్ పై రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం అన్నారు. తాజాగా వ్యాపిస్తున్న కొవిడ్‌ ప్రాణాంతకమైనది కాదని మంత్రి అన్నారు.

Minister: కొవిడ్‌పై భయాందోళనలు వద్దు

- మంత్రి ఎం.సుబ్రమణ్యం

చెన్నై: కొవిడ్‌ వ్యాప్తిపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. తేనాంపేటలో ఆరోగ్య శాఖ, వ్యాధుల నియంత్రణ వైద్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆరోగ్య శాఖ సేవల ద్వారా లక్షలాది మంది లబ్దిపొందుతున్నారన్నారు.


nani3.2.jpg

శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పలువురు మృత్యువాతపడుతున్నారని, దానిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తాజాగా వ్యాపిస్తున్న కొవిడ్‌ ప్రాణాంతకమైనది కాదన్నారు. అనారోగ్య సమస్యలున్న వారు, గర్భిణులు బహిరంగ ప్రాంతాలకు రావడం తగ్గించాలని మంత్రి సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కవితపై కేసీఆర్‌ నారాజ్‌!

ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 05 , 2025 | 01:01 PM