Share News

Satellite Based Toll: మే 1 నుంచి శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానంపై కేంద్రం క్లారిటీ

ABN , Publish Date - Apr 18 , 2025 | 08:20 PM

ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ స్థానే శాటిలైట్ టోల్ విధానాన్ని మే 1 నుంచి అమలు చేయనున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది.

Satellite Based Toll: మే 1 నుంచి శాటిలైట్‌ ఆధారిత టోల్‌ విధానంపై కేంద్రం క్లారిటీ

న్యూఢిల్లీ: మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టం (Satelite based toll collection system)ను అమలు చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర రోడ్డు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) శుక్రవారంనాడు స్పష్టత ఇచ్చింది. ఇందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఏ రోజు నుంచి అమలు చేయాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ స్థానే శాటిలైట్ టోల్ విధానాన్ని మే 1 నుంచి అమలు చేయనున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.

Prabodh Saxena: అధికారులకు విందు, బిల్లు ప్రభుత్వానికి.. సీఎస్ నిర్వాకంపై వివాదం


జీఎన్‌ఎస్ఎస్ బేస్డ్ సిస్టంను ఏప్రిల్ నెలాఖరు కల్లా అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇటీవల ధ్రువీకరించారు. అయితే కొన్ని జాప్యాల కారణంగా ఏప్రిల్ 1 నుంచి అమలు కావచ్చనే ప్రచారం జరిగింది. తాజాగా మే 1 నుంచి అమలు కావచ్చనే ప్రచారం జరిగడంతో దానిపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టత ఇచ్చింది.


మంత్రిత్వ శాఖ తాజా వివరణ ప్రకారం, ఫీజు వసూలుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపే అవసరం ఉండదు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద అమరుస్తారు. ఇందులో ఏఎన్‌పీఆర్‌తో పాటు ఫాస్టాగ్‌ కలగలిపి సేవలందిస్తారు.ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు వాహనం నంబర్‌ ప్లేట్లను గుర్తిస్తే, వాహనాలు ఆగకుండానే ఫాస్టాగ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ద్వారా టోల్‌ వసూలు చేస్తారు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇ-నోటీసులు జారీ చేయడమే కాకుండా ఫాస్టాగ్‌ రద్దు, పెనాల్టీలు విధిస్తారు.


ఇవి కూడా చదవండి..

Murshidabad Violence: రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?

India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..

PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

Updated Date - Apr 19 , 2025 | 10:08 AM