NDA CMs, Deputy CMs Meet: ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీని అభినందిస్తూ తీర్మానం
ABN , Publish Date - May 25 , 2025 | 02:58 PM
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.

న్యూఢిల్లీ: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం కీలక తీర్మానాన్ని ఆమోదించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయంలో సాయుధ బలగాలు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన్ని అభినందిస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానమంత్రి అధ్యక్షతన బీజేపీ సారథ్యంలో ఈ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఉపముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు.
NDA Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, సాయుధ బలగాలను ప్రధాని వెన్నంటి పోత్సహిస్తూ వచ్చారని, ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆపరేషన్ సిందూర్ గట్టి సమాధానం ఇచ్చిందని తెలిపింది.
ప్రధాని మోదీ మూడో టర్మ్లో ఎన్డీయే ఏడాది పాలన, సుపరిపాలనాంశాలు, కులగణన అంశం వంటివి సమావేశంలో చర్చించారు. పలువురు రాష్ట్ర మంత్రులు తమతమ రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలను సమావేశంలో వివరించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఘనంగా నివాళులర్పించారు.
Mann ki Baat: తెలంగాణ డ్రోన్ దీదీలపై ప్రధాని మోదీ ప్రశంసలు
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
For National News And Telugu News