NCW Condemns: భర్తను కోల్పోయిన హిమాన్షిపై ట్రోలింగా
ABN , Publish Date - May 06 , 2025 | 04:07 AM
భర్తను ఉగ్రదాడిలో కోల్పోయిన హిమాన్షి నర్వాల్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర స్పందన చూపించింది. వ్యక్తిగత దుఃఖంలో ఉన్న మహిళను దూషించడం అసహనకరమని పేర్కొంది

న్యూఢిల్లీ, మే 5: ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యు) మద్దతుగా నిలిచింది. ఆమెపై సోషల్మీడియాలో వస్తున్న ట్రోల్స్పై సీరియ్సగా స్పందించింది. భర్తను కోల్పోయు దుఃఖంలో ఉన్న ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం బాధాకరమని కమిషన్ వ్యాఖ్యానించింది. ఆమె వ్యక్తిగత జీవితంపై చేసిన ట్రోల్స్ ఏమాత్రం ఆమోదయోగ్యమైనవి కాదని తెలిపింది. గత నెల 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత దేఽశం మొత్తం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ముస్లింలను, కశ్మీరీలను టార్గెట్ చేయవద్దంటూ హిమాన్షి ఇటీవల విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు కొంతమందికి నచ్చలేదు. దీంతో ఆమెపై ట్రోల్స్ మొద లుపెట్టారు.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..