Share News

Meghalaya Murder: భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:23 PM

మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది.

Meghalaya Murder: భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ
Meghalaya Murder

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు, భర్తను చంపుతున్నప్పడు ఆ హత్యను కళ్లారా చూసింది సోనమ్. హత్య చేసిన హంతకులు తమ నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. మరో వైపు, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కోరిన రాజా రఘువంశీ కుటుంబీకులు మేఘాలయ సర్కారుని క్షమించమని కోరారు. ఈ కేసు దర్యాప్తులో మేఘాలయ సర్కారు పనితీరుని రాజా రఘువంశీ సోదరులు అభినందించారు.


కాగా, రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులు.. భార్య సోనమ్‌ పూర్తి ప్రమేయం ఉందని ఒప్పుకున్నారని మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ అన్నారు. నిందితులందరినీ వేర్వేరు ప్రదేశాల నుండి అరెస్టు చేశామని చెప్పారు. మొత్తం నలుగురు నిందితుల్లో ఒకరిని మధ్యప్రదేశ్‌లో, మరొకరిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశామన్నారు. మేఘాలయ పోలీసులు ఏర్పాటు చేసిన రెండు SIT బృందాలు ఆయా చోట్లకి వెళ్లి నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. హత్యలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ ఈ ఆపరేషన్‌లో పూర్తిగా పాల్గొన్నట్లు తెలిసిందని డిప్యూటీ సీఎం అన్నారు. అంతేకాదు, సోనమ్ రఘువంశీ.. భర్త రాజా రఘువంశీ హంతకులకు రూ. 20 లక్షలు ఆఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


నలుగురు నిందితులు.. ఆకాష్ రాజ్‌పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22), రాజ్ సింగ్ కుష్వాహా (21) ఆనంద్ కుర్మి తమ నేరాన్ని అంగీకరించారని ACP (ఇండోర్ క్రైమ్ బ్రాంచ్) పూనమ్‌చంద్ యాదవ్ తెలిపారు. 'ఘటన జరిగిన రోజు విశాల్ చౌహాన్ షిల్లాంగ్‌లో ఉన్నప్పుడు ధరించిన దుస్తులను మేము స్వాధీనం చేసుకున్నాం. వాళ్లు హత్య చేసినట్లు అంగీకరించారు. మేము అతని మొబైల్ కోసం వెతుకుతున్నాం' అని ACP తెలిపారు. నిందితుడు విశాల్ చౌహాన్ హత్య చేసినట్లు అంగీకరించడమే కాకుండా, రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీ ఘటనా స్థలంలో ఉన్నారని, 'తన భర్త చనిపోవడాన్ని చూశారని' వెల్లడించాడని ఏసీపీ చెప్పారు.


మరికొన్ని సోర్సెస్ ప్రకారం.. సోనమ్ రఘువంశీ.. భర్త రాజా రఘువంశీని చంపాలని చాలా పట్టుదలతో ఉందని, ఒక వేళ మర్డర్ ప్లాన్ మిస్ అయితే, భర్తని స్వయంగా పర్వతం నుండి తోసేయాలని భార్య సోనమ్ ప్లాన్ చేసిందని కూడా తెలుస్తోంది. ఇక, ఇవాళ (బుధవారం) రాజా రఘువంశీ హత్య కేసులో నలుగురు నిందితులను షిల్లాంగ్‌కు తీసుకువచ్చారు. సోనమ్ రఘువంశీని కూడా షిల్లాంగ్ సదర్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం ఏడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత మేఘాలయ పోలీసు బృందం నిందితులను షిల్లాంగ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించింది.


ఇండోర్ పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం.. మ్యారేజ్ తర్వాత కూడా సోనమ్.. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో టచ్‌లో ఉందని.. మే 16న రాజ్ తన బంధువు విశాల్ చౌహాన్, అతని స్నేహితులు ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలతో ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో మర్డర్ ప్లాన్ గురించి చర్చించారని చెప్పారు. చౌహాన్, రాజ్‌పుత్, కుర్మి మరుసటి రోజు మేఘాలయకు రాజ్ ఇచ్చిన రూ. 50,000 ఇంకా మొబైల్ ఫోన్‌తో బయలుదేరారని తెలిపారు. అయితే, సోనమ్ ప్రియుడు రాజ్ మాత్రం ఇండోర్‌లోనే ఉన్నాడని, సోనమ్ సోదరుడి ఫ్యాక్టరీలో పని చేస్తూనే ఉన్నాడని తెలిపారు.


ఇలా ఉంటే, రాజ్ కుష్వాహా తల్లి మాత్రం భోరున విలపిస్తోంది. తన కొడుకు అలాంటి వాడు కాదని, చాలా అమాయకుడని, ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయడని చెబుతోంది. తన కొడుకును రక్షించమని అభ్యర్థిస్తోంది. రాజ్ వయసులో చాలా చిన్నవాడని, తండ్రి మరణించిన తర్వాత తన ముగ్గురు సోదరీమణులను జాగ్రత్తగా చూసుకోవడం అలవాటు చేసుకున్నాడని అంటోంది.


తన భర్త 2020లో మరణించారని, ఆ తర్వాత తన కొడుకు గోవింద్ (సోనమ్ రఘువంశీ సోదరుడు) ఆఫీస్‌లో పనిచేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది. ఆ తర్వాత నుంచీ రాజ్ మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడని పేర్కొంది. 'దయచేసి నా కొడుకును కాపాడండి. ఇదే నా ఒకే ఒక్క కోరిక' అని రాజ్ తల్లి వాపోయింది. సోనమ్‌.. తన కొడుకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో తనకు తెలీదని, దీని వెనుక ఎవరున్నారో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి..

Pakistan: ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు..

LA Protests: రగులుతున్న లాస్ ఏంజెల్స్.. 2 వేల మంది గార్డ్స్‌తో..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 04:34 PM