Share News

Bengaluru Stampede: తొక్కిసలాట ఘటన... సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు

ABN , Publish Date - Jun 06 , 2025 | 06:21 PM

ఆర్‌సీబీ ఐపీఎల్ టీమ్ విజయోత్సవాన్ని విభేదిస్తూ తాను సీఎంకు సలహా ఇచ్చానని గోవిందరాజ్ పేర్కొన్నట్టు ఒక కథనం వచ్చింది. అయితే తన మాటలను వక్రీకరించారని, ఈ అంశంపై తాను ఎప్పుడూ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వలేదని గోవిందరాజ్ ‌వివరణ ఇచ్చారు.

Bengaluru Stampede: తొక్కిసలాట ఘటన... సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు

కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజకీయ కార్యదర్శి కె.గోవిందరాజ్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన నియమాకాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చినట్టు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్‌సీబీ ఐపీఎల్ టీమ్ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని స్టేడియంలో ఈనెల 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో గోవిందరాజ్‌కు ఉద్వాసన చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆయనను తొలగించడానికి కారణం ఏమిటనేది అధికారిక ప్రకటనలో వెల్లడించలేదు.


ఆర్‌సీబీ ఐపీఎల్ టీమ్ విజయోత్సవాన్ని విభేదిస్తూ తాను సీఎంకు సలహా ఇచ్చానని గోవిందరాజ్ పేర్కొన్నట్టు ఒక కథనం వచ్చింది. అయితే తన మాటలను వక్రీకరించారని, ఈ అంశంపై తాను ఎప్పుడూ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వలేదని గోవిందరాజ్ ‌వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రికి సలహా ఇవ్వడానికి నేనెవర్ని? అని ఆయన ప్రశ్నించారు. విషాదంతంగా మారిన ఫెలిసిటేషన్ ఈవెంట్‌‌ ప్లానింగ్, నిర్ణయం విషయంలో తనకెలాంటి ప్రమేయం లేదన్నారు. క్రికెట్‌కు సంబంధించిన విషయంలో తాను ఎలాంటి బ్రీఫింగ్ ఇవ్వలేదని, నిజానికి తాను కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్‌కు హెడ్‌గా ఉన్నానని చెప్పారు. ఆ కారణంగా క్రికెట్ సెలబ్రేషన్స్ పై తాను సలహాలివ్వడం సరికాదన్నారు.


కాగా, తొక్కిసలాట ఘటన అనంతరం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి.దయానంద సహా పలువురు ఐపీఎస్ అధికారులను కర్ణాటక పోలీసులు సస్పెండ్ చేశారు. సిటీ కొత్త పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్ శుక్రవారంనాడు బాధ్యతలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు..

For More National News and Telugu News..

Updated Date - Jun 06 , 2025 | 08:30 PM