Share News

Tamilisai: కమల్‌హాసన్‌ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు..

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:52 AM

కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య విభేదాలకు దారితీసేలా ఉన్నాయని బీజేపీ సీనియర్‌ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్‌ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు.

Tamilisai: కమల్‌హాసన్‌ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు..

చెన్నై: నటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌(Kamalhasan) కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు దారితీసేలా ఉన్నాయని బీజేపీ సీనియర్‌ నాయకురాలు తమిళిసై సౌందరా రాజన్‌(Tamilisai Soundararajan) ఆరోపించారు. రాణి అహల్యాబాయి హోల్కర్‌ 300వ జయంతి సందర్భంగా వేలూరు జిల్లా గుడియాత్తంలోని రోటరీ క్లబ్‌లో శుక్రవారం ఉదయం ఆమె నివాళులర్పించారు.


nani3.2.jpg

అనంతరం మీడియా సమావేశంలో తమిళిసై మాట్లాడుతూ.. కన్నడ భాషపై ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్పందించలేదన్నారు. తమిళ భాషను ప్రేమిస్తూనే మిగతా భాషలను కూడా గౌరవించాలన్న విషయం కమల్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. విమర్శలకు దారితీస్తున్న ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోతే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు చోటుచేసుకుంటాయని తమిళిసై అన్నారు.


nani3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బనకచర్లపై ఉత్తమ్‌, కవిత తప్పుడు ప్రచారం: బక్కని

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 04:19 PM