Jyothy Malhotra: జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:54 PM
జ్యోతి మల్హోత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో విచారణ నిమిత్తం ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ కేసు వివరాలపై అధికారులు పెదవి విప్పనప్పటికీ, కీలకమైన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా చేరవేసినట్టు చెబుతున్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు హిసార్ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.

న్యూఢిల్లీ: పాక్తో గూఢచర్యం కేసులో అరెస్టయి సంచలనం సృష్టించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyothy Malhotra)కు గట్టి ఎదురుదెబ్బ తగిలిది. ఆమె దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థనను హిసార్ కోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. సాక్ష్యాలు, ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ దశలో ఆమెను విడుదల చేస్తే దర్యాప్తునకు ఆటంకం కలగడంతో పాటు కీలక సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
జ్యోతి మల్హోత్రాకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో విచారణ నిమిత్తం ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ కేసు వివరాలపై అధికారులు పెదవి విప్పనప్పటికీ, కీలకమైన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా చేరవేసినట్టు చెబుతున్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు హిసార్ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది.
కాగా, ఈ కేసులో మల్హోత్రా నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్టాప్ నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఆమె బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తు్న్నారు. పాకిస్థాన్కు చెందిన యూట్యూబర్లో ఆమె సంభాషించిన ప్రాడ్క్రాస్ట్ సమాచారాన్ని కూడా సేకరించారు. అయితే ఇది శాంతి, సౌభ్రాతృత్వాన్ని ప్రమోట్ చేసేందుకు జరిగిన ఈవెంట్ అని మల్హోత్రా లాయర్లు చెబుతున్నారు. కాగా, వీసా దరఖాస్తు చేసేందుకు పాకిస్థాన్ అధికారి డేనిష్ను 20023లో ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో మల్హోత్రా కలుసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్కు ఆమె రెండు సార్లు వెళ్లినట్టు కూడా గుర్తించారు. జ్యోతి మల్హోత్రా అరెస్టు అనంతరం పాక్తో గూఢచర్యం సాగిస్తున్న పలువురిని వివిధ రాష్ట్రాల్లో పోలీసులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేష్ సిందూర్ అనంతరం పాక్తో గూఢచర్యం సాగిస్తున్న నెట్వర్క్పై కేంద్ర కొరడా ఝళిపించింది. తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలను ఆదేశించింది.
భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ
రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి