Share News

PM Modi: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ

ABN , Publish Date - May 06 , 2025 | 07:34 PM

భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి.

PM Modi: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రకం: మోదీ

న్యూఢిల్లీ: భారత్-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం (Free trade deal) కుదిరింది. ఇరుదేశాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ వాణిజ్య ఒప్పందంపై అవగాహన కుదిరినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. ఇది చారిత్రక ఒప్పందమని హర్షం వ్యక్తం చేశారు.

Shashi Taroor: ఐరాస సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు


''భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఈ ఒప్పందం ఉభయదేశాలకు ప్రయోజనకరం. ఇదొక చారిత్ర మైలురాయి. ఇది ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగాలను కల్పన, ఆవిష్కరణలను మరింతగా పాదుకొలుపుతుంది. త్వరలోనే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు భారత్‌లో ఆహ్వానం పలికేందుకు ఎదురుచూస్తున్నా'' అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా, భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి. ఆల్కహాల్, ఆటోమొబైల్స్‌పై సుంకాలు సహా సహా పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు, యూకే రాజకీయ పరిణామాలతో జాప్యం జరుగుతూ వచ్చింది.


ఇవి కూడా చదవండి

Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు

Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం

Updated Date - May 06 , 2025 | 07:36 PM