Share News

Terror Attack School Bus : ప్రపంచం కళ్లుగప్పే ప్రయత్నం.. బలోచిస్థాన్‌ ఉగ్రదాడిపై పాక్ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్

ABN , Publish Date - May 21 , 2025 | 06:27 PM

సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంలో విఫలమవుతున్న పాక్ .. బలోచిస్థాన్‌లో స్కూలు బస్సుపై ఆత్మాహుతి దాడి ఘటనను భారత్‌కు అంటగట్టే ప్రయత్నం చేసింది. ఈ దాడిలో ప్రత్యర్థి ఇండియా ప్రమేయం ఉందంటూ పాకిస్థాన్ మిలటరీ వింగ్ భారత్‌పై అక్కలు వెళ్లగక్కింది.

Terror Attack School Bus : ప్రపంచం కళ్లుగప్పే ప్రయత్నం.. బలోచిస్థాన్‌ ఉగ్రదాడిపై పాక్ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్

న్యూఢిల్లీ: దాయాదిదేశం పాకిస్థాన్‌ తన దుష్టబుద్ధిని మార్చుకోవడం లేదు. బలోచిస్థాన్‌లోని కుజ్‌దార్ ప్రావిన్స్‌లో ఒక స్కూలు బస్సుపై బుధవారంనాడు ఆత్మాహుతి దాడి వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ దిగజారుడు ఆరోపణలకు దిగింది. అయితే ఈ ఆరోపణలకు భారత్ వెంటనే తిప్పికొట్టింది. పాక్ ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. ఇది ప్రపంచదేశాల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నంగా పాక్‌ను తప్పుపట్టింది.

Terror Attack School Bus: స్కూల్ బస్సుపై ఉగ్రదాడి..నలుగురు పిల్లలు మృతి, 38 మందికి గాయాలు


బలోచిస్థాన్‌లోని కుజ్‌దార్ ప్రావిన్స్‌లో స్కూలు బస్సుపై జరిగిన దాడిలో నలుగురు పిల్లలు మరణించగా, 38 మంది గాయపడ్డారు. ఇప్పటివరకూ ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించనప్పటికీ ఇందులో బలోచిస్థాన్ వేర్పాటు వాదుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పాక్‌ నుంచి విడిపోయి స్వతంత్ర్య దేశాన్ని కోరుతున్న బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు తరచు అక్కడ ఉగ్రదాడులు సాగిస్తున్నారు. అయితే సొంత ఇంటిని చక్కబెట్టుకోవడంలో విఫలమవుతున్న పాక్ ఈ ఘటనను భారత్‌కు అంటగట్టే ప్రయత్నం చేసింది. ఈ దాడిలో ప్రత్యర్థి ఇండియా ప్రమేయం ఉందంటూ పాకిస్థాన్ మిలటరీ వింగ్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది.


ప్రజల దృష్టి మళ్లించేందుకే..

పాక్ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఖండించారు. సొంత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ ఇలాంటి ఎత్తుగడలు పన్నుతుంటుందని అన్నారు. స్కూలు బస్సుపై దాడి ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ విచారం వ్యక్తం చేసిందని చెప్పారు. ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్థాన్ స్వదేశంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తమ అంతర్గత సమస్యలపై భారత్‌ను తప్పుపట్టడం పాక్‌కు పరిపాటిగా మారిందని చెప్పారు. ప్రపంచం కళ్లకు గంతలు కట్టేందుకు పాక్ చేస్తున్న విఫలయత్నం ఇదని అన్నారు.


Puja Khedkar: ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?.. పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు

Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..

Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్‌ సభ్యుడికి గాయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 06:30 PM