Share News

Air India Crash DNA: అధిక ఉష్ణోగ్రతల మధ్య డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం.. బాధిత కుటుంబాల ఆందోళన..

ABN , Publish Date - Jun 14 , 2025 | 07:09 PM

అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ బాధితుల మృతదేహాలను గుర్తించడంలో DNA పరీక్షల (Air India Crash DNA) ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

Air India Crash DNA: అధిక ఉష్ణోగ్రతల మధ్య డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం.. బాధిత కుటుంబాల ఆందోళన..
Air India Crash DNA

గుజరాత్: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ భయానక ఘటనలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే బాధిత కుటుంబాలు తమ వారిని కోల్పోయిన వేదనతో విలవిల్లాడుతున్న వేళ, నిరాశ కలిగించే అంశం ఏంటంటే.. DNA పరీక్షల ప్రక్రియలో (Air India Crash DNA) ఆలస్యం కావడం. మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరుగుతున్న వేళ బాధిత కుటుంబాల ఆవేదన మరింత పెరుగుతోంది. వారి సన్నిహితుల చివరి రూపాన్ని చూసే అవకాశం కూడా లేకుండా ఉన్న ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది.


ప్రధాన కారణం..

ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ప్రాసెస్ నెమ్మదిగా సాగుతుండటం బాధితులను మానసికంగా కుంగిపోయేలా చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రమాద సమయంలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలేనని వైద్యులు తెలిపారు. గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ హెచ్.పి.సంగ్‌వీ ప్రకారం ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అగ్నిప్రమాదం తీవ్రత పెరిగిందన్నారు. ఈ కారణంగా మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. దీని వల్ల DNA నమూనాలను సేకరించడం సవాలుగా మారిందని తెలిపారు.


వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు

అయినప్పటికీ శాస్త్రీయంగా త్వరితగతిన గుర్తించేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. మరోవైపు మరణించిన వారి బాధితుల కుటుంబసభ్యులు ప్రస్తుతం మానసిక ఆవేదనతో ఉన్నారు. చనిపోయిన వారి పార్థివదేహాలను గుర్తించడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రి బయట పెద్దఎత్తున చేరుకుని DNA రిపోర్టుల (Air India Crash DNA) కోసం వేచి చూస్తున్నారు.


విమానాలపై పూర్తి తనిఖీలు

ఈ ప్రమాదం తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ అప్రమత్తమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే ఎనిమిది బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం భారత నౌకాశ్రయంలో ఉన్న మొత్తం 34 డ్రీమ్‌లైనర్లకు విస్తృత తనిఖీలు జరిపే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డీజీసీఏ నుంచి 787 విమానాలకు విశేష పర్యవేక్షణ ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరితగతిన వాటన్నింటినీ పూర్తిగా తనిఖీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రమాదం దేశ విమానయాన రంగంలో భద్రతా చర్యలపై సమీక్ష చేయాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 08:31 PM