EPS: నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు
ABN , Publish Date - May 10 , 2025 | 11:16 AM
ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు.. ప్రధాని నరేంద్ర మోదీకి, యుద్ధానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రజానీకం తోడుగా వుండాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను కోరారు.

- సైనికుల కోసం ప్రార్థించండి
- అన్నాడీఎంకే శ్రేణులకు ఈపీఎస్ పిలుపు
చెన్నై: ఈ నెల 12వ తేదీ తన పుట్టినరోజు సందర్భంగా తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని.. ఆడంబర వేడుకలు జరుపుకోరాదని, ఆ రోజు భారతదేశప్రజలను కాపాడేందుకు పోరాడుతున్న మన సైనికుల కోసం ప్రార్ధించాలని అన్నాడీఎంకే శ్రేణులకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswamy) హితవు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన ఎక్స్పేజీలో సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్లో పెట్రోల్ బంకులు క్లోజ్..
‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాయాది దేశం పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెబుతున్న భారతీయ సైనికులకు, వారిని ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, యుద్ధానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రజానీకం తోడుగా వుండాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమయంలో తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులెవరూ తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు రావొద్దని, ఆ రోజు రక్తదానం, అవయవ దానం, ఉచిత వైద్యశిబిరాలు, సంక్షేమ సహాయాలు పంపిణీ చేయాల్సిందిగా ఈపీఎస్ సూచించారు. భారతీయ సైనికులు విజయం సాధించాలని ఆలయాలు, మసీదులు, చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించాలని ఈపీఎస్ అన్నాడీఎంకే కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News