EPS: హీరో విజయ్పై విమర్శలు వద్దు..
ABN , Publish Date - May 31 , 2025 | 11:09 AM
టీవీకే అధ్యక్షుడు, హీరో విజయ్పై విమర్శలు చేయవద్దని పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సూచించారు. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిపై విమర్శలు గుప్పించాలని, డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- డీఎంకే అసమర్ధ పాలనపై ప్రచారం
- పార్టీ శ్రేణులకు ఈపీఎస్ పిలుపు
చెన్నై: రాష్ట్రంలో డీఎంకే(DMK) ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలకు తెలియజేయాలని, అదే సమయంలో టీవీకే అధ్యక్షుడు విజయ్(Vijay)పై ఎలాంటి విమర్శలు చేయవద్దని పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) సూచించారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈపీఎస్ నేతృత్వంలో గురువారం ప్రారంభమైన జిల్లా ఇన్చార్జ్లు, జిల్లా కార్యదర్శుల సమావేశం రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది.
తొలిరోజు సమావేశంలో 42 జిల్లాల ఇన్చార్జులు, కార్యదర్శులు, రెండో రోజు సమావేశంలో 40 జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. జిల్లాల్లో ఏర్పాటుచేసిన బూత్ కమిటీల వివరాలు తెలుసుకున్న ఈపీఎస్.. మిగిలిన ప్రాంతాల్లో జూన్ నెలాఖరులోపు బూత్ కమిటీలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బలమైన మెగా కూటమి ఏర్పాటుకానుందని, ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలు, నేతలు సమష్టిగా కృషిచేయాలన్నారు.
ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిపై విమర్శలు గుప్పించాలని, అదే సమయంలో టీవీకే అధ్యక్షుడు విజయ్పై ఎలాంటి విమర్శలు చేయరాదని సూచించారు. రాబోయే ఏడాది కాలంలో నేతలు విహారయాత్రలకు వెళ్లకుండా కార్యకర్తలు, బూత్ కమిటీలను సమన్వయపరచి, డీఎంకే అసమర్ధపు పాలనను ప్రజలకు తెలియజేసి పార్టీ మళ్లీ అధికారం చేపట్టేలా ప్రచారం సాగించాలని ఈపీఎస్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
Read Latest Telangana News and National News