Jaypee Infratech: రూ.12 వేల కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్ఫ్రాటెక్పై ED దాడులు
ABN , Publish Date - May 23 , 2025 | 03:14 PM
రూ.12,000 కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

రూ.12 వేల కోట్ల మోసం కేసులో జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ(The Enforcement Directorate) దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఇవాళ(శుక్రవారం) ఈడీ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు అధికారిక వర్గాలు నిర్ధారించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద ఢిల్లీ-NCR, ముంబైలో దాడులు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల సొమ్ములు సుమారు ₹12,000 కోట్ల మేరకు మోసం, ఇంకా నిధుల "మళ్లింపు"కు సంబంధించిన కేసులో జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్ లిమిటెడ్, ఇతరులపై ఈ సోదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. గౌర్సన్స్, గుల్షన్, మహాగున్, సురక్ష రియాలిటీ వంటి, జేపీ ఇన్ ఫ్రా అనుబంధ సంస్థలపై కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, దాడుల నేపథ్యంలో సంబంధిత కంపెనీలు ఇప్పటివరకూ ఏమీ స్పందించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
బుగ్గమఠం భూములపై దేవదాయ ట్రైబ్యునల్’ను ఆశ్రయించండి
స్కామ్లు బయటపడేకొద్దీ జగన్లో భయం
For International News And Telugu News