SC-TN: ED అన్ని పరిమితులు దాటుతోంది.. సుప్రీం తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - May 22 , 2025 | 01:52 PM
తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ TASMACపై దర్యాప్తులో ED చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈడీ అన్ని పరిమితులు దాటుతోందని వ్యాఖ్యానించింది.

దర్యాప్తు సంస్థ ED(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ తనకున్న అన్ని పరిమితులు దాటుతోందని వ్యాఖ్యానించింది. TASMAC దాడులపై స్పందించిన సుప్రీంకోర్టు.. సదరు దర్యాప్తు సంస్థను తీవ్రంగా విమర్శించింది. తమిళనాడు ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం రిటైలర్ అయిన TASMACపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ దర్యాప్తును సుప్రీంకోర్టు ఇవాళ (బుధవారం) నిలిపివేసింది.
దర్యాప్తు ఏజెన్సీ చర్యలను తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు.. ED సమాఖ్య సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. "ఇది TASMACపై ఎలా దాడి చేయగలదు" అని SC ప్రశ్నించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం రిటైలర్ అయిన TASMACపై ED దాడులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఇవాళ విచారించింది.
TASMAC ప్రాంగణంలో ED దాడులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, TASMAC రెండూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసి, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ED తన దర్యాప్తును కొనసాగించడానికి అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీంతో ఈ అంశం మీద సుప్రీం కోర్టు ఇవాళ స్పందించింది.
మద్రాస్ హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..
మార్చి 6, 8 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్ అయిన TASMAC ఆఫీస్ ప్రాంగణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడులను సవాలు చేస్తూ TASMAC, తమిళనాడు ప్రభుత్వం రెండూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, మనీలాండరింగ్ "దేశ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరం" అని పేర్కొంటూ హైకోర్టు వారి పిటిషన్లను తోసిపుచ్చింది. ED చర్య రాజకీయంగా ప్రేరేపించబడిందనే ప్రభుత్వ వాదనను సైతం హైకోర్టు తప్పుబట్టింది. కోర్టు "రాజకీయ శక్తుల ఆటను" అంచనా వేయగలదా? లేదా "రాజకీయ క్రీడలో భాగస్వామి" కాగలదా? అని అడిగింది.
దర్యాప్తు సంస్థలుగా వేధింపులకు సంబంధించిన ఇటువంటి వాదనలను అంగీకరించడం వల్ల ప్రతి చట్టబద్ధమైన దర్యాప్తు విధానాన్ని సవాలు చేసే పౌరుల నుండి "వ్యాజ్యాల వరద" వచ్చే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది. సోదాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి అవసరమనే భావనను కూడా మద్రాస్ హైకోర్టు ఖండించింది. దీనిని "పూర్తిగా అశాస్త్రీయమైనది, మనస్సాక్షి లేనిది" అని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దీంతో ప్రభుత్వం.. సదరు లిక్కర్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇవాళ సుప్రీం నుంచి సానుకూల తీర్పు వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి
Read Latest Telangana News and National News