Drones: 11, 12 తేదీల్లో డ్రోన్లపై నిషేధం..
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:08 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధ, గురువారాల్లో సేలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సేలం జిల్లాలో ఆ రెండ్రోజులు డ్రోన్లపై నిషేధం విధించినట్లు కలెక్టర్ బృందాదేవి ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

- సీఎం స్టాలిన్ సేలం పర్యటన
చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) బుధ, గురువారాల్లో సేలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సేలం జిల్లాలో ఆ రెండ్రోజులు డ్రోన్లపై నిషేధం విధించినట్లు కలెక్టర్ బృందాదేవి(Collector Brindadevi) ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. డెల్టా జిల్లాల్లోని వ్యవసాయ భూములకు ఈ నెల 12న సేలం సమీపంలోని మెట్టూరు డ్యాం నీటిని ముఖ్యమంత్రి స్టాలిన్ విడుదల చేయనున్నారు.
అనంతరం సేలం ప్రభుత్వ మోహనకుమార మంగళం వైద్యకళాశాల ప్రాంగణంలో జరగనున్న కార్యక్రమంలో సీఎం పాల్గొని కొత్త పథకాలకు శంకుస్థాపన చేసి, పూర్తైన పథకాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు ప్రభుత్వం తరుఫున సంక్షేమ సహాయాలు పంపిణీ చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బృందాదేవి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన ధరలు
నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి
Read Latest Telangana News and National News