Share News

DNA tests: విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు

ABN , Publish Date - Jun 15 , 2025 | 07:29 AM

Air India plane crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతుల డీఎన్‌ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు సివిల్ హాస్పిటల్ సీనియర్‌ వైద్యుడు వెల్లడించారు.

DNA tests: విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు
DNA Tests

Ahmedabad: ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదంలో (Plane Crash) మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైద్యులు డిఎన్ఎ పరీక్షలు (DNA Tests) నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు, 15 మంది వారి డిఎన్ఏ నమూనాలు సరిపోలాయి. మరణించిన వారి ముగ్గురు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించినట్లు సివిల్ హాస్పిటల్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ వెల్లడించారు. 274 మంది దుర్మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. డీఎన్‌ఏ పరీక్షతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డీఎన్‌ఏను గుర్తించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి అయిన విశ్వాస్‌కుమార్‌ రమేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


ఉన్నతస్థాయి కమిటి...

కాగా ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని.. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని ఆయన అన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర, విధాన ఆధారిత రోడ్‌‌మ్యాప్‌ను కూడా రూపొందిస్తుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో

జగన్‌ను నమ్ముకుంటే జైలుకే...

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 15 , 2025 | 01:28 PM