CPM: కూటమి లేకుండా డీఎంకే విజయం అసాధ్యం
ABN , Publish Date - Jun 11 , 2025 | 10:44 AM
ఎన్నికల్లో కూటమి లేకుండా డీఎంకే గెలవడమన్నది అసాధ్యమని, 2019 లోక్సభ ఎన్నికల నుండి 2024 లోక్సభ ఎన్నికల దాకా మిత్రపక్షాలను కలుపుకునే ఆ పార్టీ గెలిచిందని, ఈ పరిస్థితి వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం వ్యాఖ్యానించారు.

- ఈసారి 10 సీట్లు అడుగుతాం
- సీపీఎం నేత షణ్ముగం
చెన్నై: ఎన్నికల్లో కూటమి లేకుండా డీఎంకే గెలవడమన్నది అసాధ్యమని, 2019 లోక్సభ ఎన్నికల నుండి 2024 లోక్సభ ఎన్నికల దాకా మిత్రపక్షాలను కలుపుకునే ఆ పార్టీ గెలిచిందని, ఈ పరిస్థితి వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం(P. Shanmugam) వ్యాఖ్యానించారు. నగరంలో మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ... డీఎంకే కూటమిలో ప్రస్తుతం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే, ఎంఎన్ఎం పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయని, వారిని ముఖ్యమంత్రి స్టాలిన్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారని, ఈ సారి శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలకు గతం కంటే ఎక్కువ సీట్లను కేటాయిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.
2021లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టినా, అప్పట్లో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలువకూడదనే ఏకైక లక్ష్యంతో డీఎంకే కేటాయించిన సీట్లే తీసుకున్నామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర చరిత్రలోనే అంత తక్కువ స్థానాల్లో పోటీ చేయడం అదే ప్రథమమని చెప్పారు. అలాంటి పరిస్థితి వచ్చే యేడాది జరుగబోయే శాసనసభ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని తెలిపారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధిష్టానవర్గం పట్టువిడుపులకు పోకుండా సీపీఎంకు కనీసం 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని షణ్ముగం డిమాండ్ చేశారు.
డీఎంకే పాలన భేష్..
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా డీఎంకే పరిపాలన అన్ని వర్గాలూ మెచ్చుకునేలా కొనసాగిందని, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలనే కాకుండా చెప్పని కొత్త హామీలను కూడా నెరవేర్చిందని, ముఖ్యంగా మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసిందని షణ్ముగం ప్రశంసించారు. రాబోయే పది నెలల్లోనూ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్న్యూస్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
Read Latest Telangana News and National News