Share News

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్

ABN , Publish Date - May 24 , 2025 | 03:00 PM

ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండటం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటగా చెప్పాలి.

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు..  ఆసుపత్రుల్లో హైఅలర్ట్

న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న కోవిడ్ కేసులు మరోసారి వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పలు పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులను అప్రమత్తం చేస్తున్నారు.

Early Monsoon 2025: 16 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి త్వరగా రుతుపవనాలు.. ఈ పంటలకు మంచి లాభం..


ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండటం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటగా చెప్పాలి. ఇంతవరకూ ఎవరూ మరణించినట్టు వార్తలు రాలేదు. దక్షిణ భారతంలో కేసులు పెరుగుతుండటంతో ఒమెక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి చెందుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వేరియంట్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, ఇది ఆందోళన కలిగించే వేరియంట్ కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ను ఉటంకిస్తూ నిపుణులు చెబుతున్నారు.


వ్యాధి లక్షణాలు అతి స్వల్పంగా ఉంటున్నందున నాలుగైదు రోజుల్లో కోలుకుంటున్నారని, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, శ్వాసకోస ఇబ్బందులు వంటివి కామన్‌గా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఢిల్లీలో 23 కరోనా కేసులు ఉన్నట్టు తెలుస్తుండటంతో ఆసుపత్రులన్నీ సరపడా పడకలు, ఆక్సిజన్ సిలెండర్లు, టెస్టింగ్ కిట్లు, వాక్సీన్లను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొత్త వేరియంట్ సాధారణ ఫ్లూ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు. నొయిడా, ఘజియాబాద్ వంటి ఢిల్లీ-ఎన్‌సీఆర్ సిటీల్లోనూ కరోనా కేసులు రికార్డవుతున్నాయి. శనివారంనాడు తొలిసారి నొయిడాలో 55 ఏళ్ల మహిళకు కరోనా వచ్చినట్టు గుర్తించగా, ఘజియా‌బాద్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.


కేరళలో మేలో 273 కేసులు నమోదు కావడంతో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి సూచనలు ఇచ్చారు. ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశించారు. దగ్గు లక్షణాలు కనిపిస్తే ప్రజలు ముఖానికి మాస్క్ వేసుకోవాలని సూచించారు. ఇటు కర్ణాటకలోనూ 35 మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో హాస్కోతెలోని 9 నెలల శిశువు కూడా ఉంది. మేలో ముంబైలో 95 కేసులు నమోదు కాగా, ఆసుపత్రి పాలైన వారి సంఖ్య తక్కువగానే ఉంది. కేవలం 16 మంది ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారు. ఎవరికైనా ఎస్ఏఆర్‌ఐ లక్షణాలుంటే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీఎంసీ సిఫారసు చేసింది. మహారాష్ట్రలో గత మూడు రోజుల్లో 10 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ సరిపడా మెడిసన్లు ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో పెరుగుదల లేనప్పటికీ వ్యాక్సీన్లు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్క్‌లు తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు అదేశించారు. కోవిడ్ బాధిత దేశాల నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఇవి కూాడా చదవండి..

Rains: రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు

Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 03:04 PM