Dawood Ibrahim Drugs Party: దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ పార్టీలో బాలీవుడ్ తారలు..
ABN , Publish Date - Nov 15 , 2025 | 03:29 PM
దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీ: దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై యాంటీ-నార్కోటిక్స్ సెల్(ANC) పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలకు బాలీవుడ్ తారలు నోరా ఫతేహి, శ్రద్ధా కపూర్ సహా ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రద్ధా కపూర్, నోరా ఫతేహికి ముంబై పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఓ చిత్రంలో దావూద్ సోదరి పాత్రలో శ్రద్ధా కపూర్ నటించగా.. దావూద్ పాత్రలో ఆమె సోదరుడు సిద్ధార్థ్ కపూర్ యాక్ట్ చేశారు.
కాగా, రూ.250 కోట్ల డ్రగ్స్ సిండికేట్లో భాగమైన షేక్ తాహిర్ డోలాని ముంబై యాంటీ-నార్కోటిక్స్ సెల్ పోలీసులు అరెస్టు చేసి విచారించగా సంచలన విషయాలు తెలుస్తున్నాయి. షేక్ తాహిర్ డోలా అతని తండ్రి అయిన సలీం డోలా.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకి దగ్గరి బంధువులు. అయితే, తాహిర్ని దుబాయ్ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అతను భారత్ సహా పలు దేశాల్లో రేవ్, డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడు. దేశ విదేశాల్లో నిర్వహించిన ఈ పార్టీలకు చాలా మంది బాలీవుడ్ తారలు, ఫ్యాషన్ రంగ ప్రముఖులు హాజరైనట్లు విచారణలో తాహిర్ చెప్పిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి సహా మరికొంతమందిని పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాగా, నిందితుడిపై మెఫెడ్రోన్ (ఎం-క్యాట్ లేదా మియావ్ మియావ్) అనే డ్రగ్ అమ్మకం- పంపిణీపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఈ వార్త సినీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మాఫియా డాన్లతో సినీ రంగ ప్రముఖులకు ఉన్న చీకటి సంబంధాలను ఈ కేసు వెలుగులోకి తెస్తుండడం సంచలనంగా మారుతోంది.
ఇవి కూడా చదవండి..
ఫరీదాబాద్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి..
హీరో విశాల్ - లైకా కేసు... విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..