Thackeray Cousins Renuion: మళ్లీ కలవడం కష్టమేమీ కాదు.. సంకేతాలిచ్చిన థాకరే సోదరులు
ABN , Publish Date - Apr 19 , 2025 | 06:25 PM
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొని ఉమ్మడి సందేశం ఇచ్చారు. మరాఠీ భాష, సాంస్కృతిక ప్రయోజనాల పరిరక్షణ చాలా ముఖ్యమని, దానిముందు రాజకీయ శత్రుత్వాలు పెద్ద విషయమేమీ కాదని అన్నారు.

ముంబై: ఒకప్పుడు కలిసి పనిచేసి ఆ తర్వాత విడిపోయిన థాకరే సోదరులు ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), రాజ్ థాకరే (Raj Thackeray) మళ్లీ కలిసి పనిచేయనున్నారా? విభేదాలు విస్మరించి తిరిగి జత కట్టేందుకు సిద్ధమవుతున్నారా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. మఠాఠీ ఉనికి, సంస్కృతికి ముప్పు ఏర్పడనుందనే భయాందోళనల నేపథ్యంలో థాకరే బ్రదర్స్ తిరిగి జత కట్టేందుకు సిద్ధపడుతున్నారు. కలిసి పనిచేయడం ఏమంత కష్టం కాదంటూ తాజాగా థాకరే సోదరులు వేర్వేరు కార్యక్రమాల్లో సంకేతాలిచ్చారు.
India-Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ నేత హత్య.. తీవ్రంగా ఖండించిన భారత్
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరేలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొని ఉమ్మడి సందేశం ఇచ్చారు. మరాఠీ భాష, సాంస్కృతిక ప్రయోజనాల పరిరక్షణ చాలా ముఖ్యమని, దానిముందు రాజకీయ శత్రుత్వాలు పెద్ద విషయమేమీ కాదని అన్నారు.
విభేదాలు చిన్నవే.. కలిసి పనిచేసేందుకు సిద్ధమే
నటుడు, ఫిల్మ్మేకర్ మహేష్ మంజ్రేకర్తో జరిగిన ప్రాడ్కాస్ట్లో థాకరే సోదరులు తిరిగి కలిసి పనిచేసే అవకాశంపై రాజ్థాకరే మాట్లాడుతూ, తనకు, ఉద్ధవ్కు మధ్య విభేదాలు చాలా స్పల్పమని, వీటికంటే మహారాష్ట్ర (రాష్ట్ర ప్రయోజనాలు) తమకు చాలా ముఖ్యమని అన్నారు. ''విభేదాల వల్ల మహారాష్ట్రకు, మరాఠా ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని నిరూపణ అయింది. కలిసి పనిచేయడం పెద్ద కష్టమేమీ కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది కేవలం కోరికో, స్వార్థమో కాకూడదు. విశాల దృక్పథంతో దీనిని చూడాలి. మరాఠా ప్రజల కోసం రాజకీయ పార్టీలన్ని ఐక్యమై ఒకే పార్టీగా ఏర్పడాలి'' అని రాజ్థాకరే అన్నారు.
శివసేనను తాను విడిచిపెట్టినప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు తనతో ఉన్నారని, అయినప్పటికీ బాలాసాహెబ్ కింద తప్ప మరెవ్వరి కింద పనిచేయడం ఇష్టం లేక ఒంటరిగానే తాను బయటకు వెళ్లిపోయాయని రాజ్థాకరే గుర్తుచేశారు. ఉద్ధవ్తో కలిసి పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే రెండోవైపు కూడా తనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడాలి కదా? అని అన్నారు. తాము కలిసి పనిచేయాలని మహారాష్ట్ర ప్రజలు కోరితే ఎలాంటి ఇగోల జోలికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
విభేదాలు పక్కనపెట్టేందుకు నేను రెడీ..
కాగా, భారతీయ కాంగార్ సేన కార్యక్రమంలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. ''మహారాష్ట్ర ప్రయోజనాల కోసం మరాఠా ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. అయితే ఒక షరతు. ఉదాహరణకు గుజరాత్కు పరిశ్రమలు తరలిస్తున్నారనే పార్లమెంటులో మేము లేవనెత్తినప్పుడు అందరూ ఐక్యంగా ఉంటే మహారాష్ట్ర కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయగలుగుతాం. నిమిషానికో మాట మార్చేలా ఉండకూడదు. ఒకసారి మద్దతు ఇచ్చి, మరుసటి రోజే దానిని వ్యతిరేకింది, ఆ తర్వాత మళ్లీ రాజీపడి.. ఇలా ఉండకూడదు'' అని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేవారిని తాను ఆహ్వానించడం కానీ, ఇంటికి పిలవడం కానీ, వారితో కలిసి కూర్చోవడం కానీ చేయనని అన్నారు. మొదట మహారాష్ట్ర ప్రయోజనాల విషయంలో స్పష్టత ఇవ్వాలని, అప్పుడు కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు.
హిందీని తప్పనిసరి చేయడంపై బ్రదర్స్ అభ్యంతరం
కాగా, మహారాష్ట్రలో 1 నుంచి 5వ తరగతి వరకూ హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనమవుతోంది. ఈ పాలసీతో ఉద్ధవ్, రాజ్ థాకరే విభేదిస్తున్నారు. మరాఠీ సంస్కృతిని బలహీనపరచే ప్రయత్నంగా వేర్వేరు ప్రకటనల్లో వీరు ఖండించారు. మరాఠీకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చిన తరుణంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం సరికాదని వారు తెలిపారు. "హిందీని తప్పనిసరి చేయాలని మీరనుకుంటే, ఘట్కోపార్ (సెంట్రల్ ముంబైలో గుజరాతీల అధిపత్యం ఉన్న ప్రాంతం)లో మరాఠీని తప్పనిసరి చేయాలని ఫడ్నవిస్కు నేను చెప్పదలచుకున్నాను'' అని రాజ్థాకరే ఒక ట్వీట్లో పేర్కొన్నారు. నార్త్ ఇండియన్లు, గుజరాతీలు, ముస్లింలు అందరూ మనతో ఉన్నప్పుడు వారిని విడగొట్టాలని ఎందుకనుకుంటున్నారు? మేము హిందీకి వ్యతిరేకం కాదు. కానీ ఎందుకు ఆ భాషను తప్పనిసరి చేస్తు్న్నారు? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..