CJI Sanjiv Khanna: అధికార పదవులకు దూరం: సీజేఐ సంజీవ్ ఖన్నా
ABN , Publish Date - May 13 , 2025 | 06:57 PM
జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజేఐగా ఖన్నా పనితీరును బార్ సీనియర్ లాయర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) మంగళవారం నాడు పదవీ విరమణ (Reitrement) చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి పదవులూ చేపట్టనని స్పష్టం చేశారు. అయితే, న్యాయవ్యవస్థకు సంబంధించిన ఏదో ఒక పని చేస్తానని తెలిపారు.
Col Sophiya: కల్నల్ సోఫియా ఉగ్రవాదుల సోదరంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ వివాదానికి సంబంధించిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సంజీవ్ ఖన్నా సమాధామిస్తూ, జ్యూడిషియరీ అనేది సానుకూల, ప్రతికూల అంశాలను చూస్తుందని, హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ''మేము చేయాల్సి వచ్చినప్పుడు, నిర్ణయాలు తీసుకుంటాం. మనం చేసింది సరైనదా, కాదా? అనేది భవిష్యత్తు చెబుతుంది'' అని అన్నారు.
జస్టిస్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజేఐ ఖన్నా పనితీరును బార్ సీనియర్ లాయర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు. సీజేఐ నిర్ణయాలు ఎంతో ఆలోచనాత్మకంగా, మానవ హక్కులకు ప్రాధాన్యత ఇచ్చేవిగా ఉండేవని తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు. సీజేఐ తీర్పులన్నీ చాలా స్పష్టంగా, సరళతతో ఉండేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసించారు. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది నవంబర్ 11న జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు 2005లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 జనవరి 19న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, భారత 52వ సీజేఐగా బీఆర్ గవాయ్ మే 14న బాధ్యతలు చేపడతారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు