Char Dham Yatra: చార్ధామ్ యాత్రకు 30 రోజల్లో 16 లక్షల మంది భక్తులు
ABN , Publish Date - May 31 , 2025 | 07:47 PM
ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రకు రద్దీ పెరిగింది. మే 2న ఆలయ తలుపులు తెరుచుకున్నప్పటి నుంచి ఇంతవరకూ 6.5 లక్షల మంది కేదార్నాథ్ను దర్శించారు. గంగోత్రి, యమునోత్రి ధామ్లు అక్షయ తృతీయ పవిత్రదినాన తెరుకుకోవడంతో చార్ధామ్ యాత్ర అధికారికంగా ఏప్రిల్ 30న ప్రారంభమైంది.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఛార్ధామ్ యాత్ర (Chardham Yatra)కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చార్ధామ్, హేహకుండ్ సాహిబ్కు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశీ భక్తులు ఏటా ఎంతో ఆసక్తిగా తరలివస్తుంటారు. ఈ యాత్రను హిందువులు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ఈ సీజన్లో చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి గత 30 రోజుల్లో 16 లక్షల మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రకు రద్దీ పెరిగింది. మే 2న ఆలయ తలుపులు తెరుచుకున్నప్పటి నుంచి ఇంతవరకూ 6.5 లక్షల మంది కేదార్నాథ్ను దర్శించారు. గంగోత్రి, యమునోత్రి ధామ్లు అక్షయ తృతీయ పవిత్రదినాన తెరుకుకోవడంతో చార్ధామ్ యాత్ర అధికారికంగా ఏప్రిల్ 30న ప్రారంభమైంది. కేదార్నాథ్ ధామ్ మే 2న, బద్రీనాథ్ ధామ్ మే 4న తెరుచుకున్నాయి. ఈ ఆలయాలు ప్రతి సంవత్సరం ఆరు నెలలే తెరిచి ఉంటాయి. శీతాకాలం (అక్టోబర్-నవంబర్)లో మూతపడి సమ్మర్లో (ఏప్రిల్-మే)లో తెరుస్తుంటారు.
చార్ధామ్ యాత్ర ప్రాముఖ్యత
హిందువులు అత్యంత పవిత్రమైన యాత్రల్లో ఒకటిగా చార్ధామ్ యాత్రను హిందువులు భావిస్తుంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాధ్ను చుట్టిరావడాన్ని చార్ధామ్ యాత్ర అంటారు. క్లాక్వైజ్లో యాత్ర సాగిస్తుంటారు. యమునోత్రితో మొదలై ఆ తర్వాత గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా సాగుతూ బద్రీనాథ్తో యాత్ర ముగుస్తుంది. ఏప్రిల్-మే, అక్టోబర్-నవంబర్ మధ్య భక్తులు ఈ యాత్రలను చేపడుతుంటారు.
ఇవి కూడా చదవండి..
జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి