India-Pakistan Tensions: మే15 వరకూ 24 విమానాశ్రయాలు మూత.. కేంద్రం ప్రకటన
ABN , Publish Date - May 09 , 2025 | 08:26 PM
చంఢీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భున్తర్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, జమ్మూ, బికనెర్, లెహ్, పోర్బందర్ తదితర సిటీల్లో విమానాశ్రయాలను ఈనెల 15 వరకూ మూసివేయనున్నారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, పాక్ మిలటరీ డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టడంతో న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య తలెత్తిన ఉద్రితక్తల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలను మే 15వ తేదీ ఉదయం 5.29 గంటల వరకూ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి ముందు, 24 విమానాశ్రయాల్లో పౌర విమానాల సర్వసులను మే 10 వరకూ మూసివేస్తున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారంనాడు ప్రకటించింది. తాజాగా మే 15 వరకూ దీనిని పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
Operation Sindoor: ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ
చంఢీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూథియానా, భున్తర్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, జమ్మూ, బికనెర్, లెహ్, పోర్బందర్ తదితర సిటీల్లో విమానాశ్రయాలను ఈనెల 15 వరకూ మూసివేయనున్నారు.
కాగా, పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వయిజరీని జారీ చేశాయి. ఏవియేషన్ అధికారుల నోటిఫికేషన్ ప్రకారం పలు విమానాశ్రయాలు మూసివేత కొనసాగుతుందని, జమ్మూ, శ్రీనగర్, లెహ్, జోథ్పూర్, అమృత్సర్, ఛండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట స్టేషన్ల నుంచి విమానాల రాకపోకలు 15వ తేదీ ఉదయం 5.29 గంటల వరకూ రద్దయినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఒకసారి రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేస్తామని, క్యాన్సిలేషన్ చేసుకుంటే పూర్తి మొత్తం చెల్లిస్తామని తెలిపింది. కాగా, తాత్కాలికంగా విమానాశ్రయాలను మూసివేయడంతో శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లెహ్, చండీగఢ్, ధర్మశాల, బికనెర్, రాజ్కోట్, జోథ్పూర్, కిషన్గఢ్ విమాన సర్వీసులు మే 15 తేదీ ఉదయం 5.30 గంటల వరకూ రద్దయినట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. సెక్యూరిటీ ప్రోటోకాల్ను పటిష్టం చేయడంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడినట్టు ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. శుక్రవారం పలు, దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల్లో జాప్యం తలెత్తినట్టు తెలిపింది.
Also Read:
Operation Sindoor: సైబర్ దాడి.. బిగ్ అలర్ట్
పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
For National News And Telugu News