Share News

CAIT Letter To Piyush Goyal: ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫారాలపై పాక్ జెండాలు.. సీఏఐటీ అభ్యంతరం

ABN , Publish Date - May 14 , 2025 | 11:48 AM

CAIT Letter To Piyush Goyal: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ లేఖ రాసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలపై పాకిస్థాన్ జెండాలు, లోగోలు ఉన్న వస్తువులు విక్రయమవుతున్నట్టు సమాచారం ఉందని పేర్కొంది.

CAIT Letter To Piyush Goyal: ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫారాలపై పాక్ జెండాలు.. సీఏఐటీ అభ్యంతరం
CAIT Letter To Piyush Goyal

న్యూఢిల్లీ, మే 14: పాకిస్థాన్ జెండాలు, లోగోలు, మగ్స్, టీ-షర్ట్‌ల విక్రయంపై ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (CAIT) ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటి విక్రయాలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు (Union Commerce Minister Piyush Goyal) ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ లేఖ రాసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ - కామర్స్ ప్లాట్‌ఫారాలపై పాకిస్థాన్ జెండాలు, లోగోలు ఉన్న వస్తువులు విక్రయమవుతున్నట్టు సమాచారం ఉందని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇలాంటి విక్రయాలు తీవ్రంగా దేశాభిమానం దెబ్బతీస్తున్నాయని పేర్కొంది.


జవాన్లు దేశ రక్షణకు ప్రాణాలను త్యాగం చేస్తున్న సమయంలో పాకిస్థాన్ గుర్తులు ఉన్న వస్తువుల అమ్మకాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశ భద్రతకు, అంతర్గత సామరస్యతకు ప్రమాదకరమైన విషయమని లేఖలో పేర్కొంది. పాకిస్థాన్ జెండాలు, లోగోలు ఉన్న వస్తువులపై తక్షణం నిషేధం విధించాలని కోరింది. ఇలాంటి ఉత్పత్తులు ఎలా అప్‌లోడ్ అయ్యాయో సమగ్ర విచారణ జరిపించాలని వెల్లడించింది.


ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నియంత్రణా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ గౌరవాన్ని దెబ్బతీసే ఉత్పత్తులపై ఈ-కామర్స్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఇది దేశ గౌరవానికి సంబంధించిన అంశమని.. వాణిజ్య స్వేచ్ఛ కోసం కాదని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ లేఖలో స్పష్టంగా కోరింది.


ఇవి కూడా చదవండి

India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..

Tirumala: మే 15 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు

Read Latest National News And Telugu News

Updated Date - May 14 , 2025 | 11:54 AM