Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్లో లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి
ABN , Publish Date - Nov 24 , 2025 | 02:14 PM
ఉత్తరాఖండ్లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 28 ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి-హిండోలఖల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అక్కడి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి: