BJP: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్ర
ABN , Publish Date - May 12 , 2025 | 09:21 PM
పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ బీజేపీ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం చేపట్టిన "ఆపరేషన్ సిందూర్'' (Operation Sindoor) విజయవంతం కావడం, భారత్తో కాల్పుల విరమణకు పాక్ దిగిరావడంతో భారతీయ జనతా పార్టీ (BJP) దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించింది. పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ బీజేపీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించనున్నారు.
PM Modi: అణ్వస్త్రాల బూచికి బెదరం: మోదీ
తిరంగా యాత్ర నిర్వహణపై గత ఆదివారం నుంచి కసరత్తు జరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమై దీనిపై విస్తృతంగా చర్చించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులతోనూ జేపీ నడ్డా సోమవారం సమావేశమై యాత్రకు తుదిరూపు ఇచ్చారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి, మంత్రుల వరకూ ఈ తిరంగ యాత్రలో పాల్గొని ఆపరేషన్ సింధూర్, భారత సైన్యం సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సీనియర్ నేతలు వినోద్ తావ్డే, సంబిత్ పాత్ర, తరుణ్ చుగ్ తదితర సీనియర్ నేతలు ఈ యాత్రను సమన్వయపరుస్తూ దేశంలోని మారమూల ప్రాంతాలకు కూడా యాత్రను తీసుకు వెళ్లే బాధ్యతను అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్కు వార్నింగ్..