సంగీత విద్వాంసురాలితో బీజేపీ ఎంపీ తేజస్వి వివాహం
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:46 AM
ఓ కచేరీలో సంగీత విద్యాంసురాలితో పరిచయం బీజేపీ ఎంపీ తేజస్విని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య, చెన్నైకి చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్ ఒక ఇంటివారయ్యారు.

బెంగళూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఓ కచేరీలో సంగీత విద్యాంసురాలితో పరిచయం బీజేపీ ఎంపీ తేజస్విని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య, చెన్నైకి చెందిన గాయని శివశ్రీ స్కంద ప్రసాద్ ఒక ఇంటివారయ్యారు. కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన ఓ సంగీత కచేరీలో శివశ్రీ స్కందప్రసాద్ను తేజస్వి తొలిసారి చూశారు. ఆపై ఇరువురూ పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలెక్కారు. గురువారం ఉదయం బెంగళూరు కనకపుర రోడ్డులోని ఓ రిసార్టులో జరిగిన వీరి వివాహానికి రెండు కుటుంబాలవారి సమీప బంధువులు, ఆప్తులు, పలువురు బీజేపీ నేతలు మాత్రమే హాజరయ్యారు.