Goa: బీచ్లో ఇడ్లీ-సాంబార్.. విదేశీయులెలా వస్తారు?
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:51 AM
గోవాకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి బీచ్లో ఇడ్లీ-సాంబార్, వడ-పావ్ అమ్మడమే కారణమని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైఖెల్ లోబో ఆరోపించడం రాజకీయ దుమారాన్ని రేపింది.

పణజీ, ఫిబ్రవరి 28: గోవాకు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి బీచ్లో ఇడ్లీ-సాంబార్, వడ-పావ్ అమ్మడమే కారణమని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మైఖెల్ లోబో ఆరోపించడం రాజకీయ దుమారాన్ని రేపింది. ‘బెంగళూరు నుంచి వచ్చిన కొందరు ఇడ్లీ-సాంబార్, వడ-పావ్ అమ్ముతున్నారు. అందుకే రెండేళ్లుగా అంతర్జాతీయ టూరిజం తగ్గింది’ అని అన్నారు. దీనిపై విమర్శలు రావడంతో.. బీచ్లో సంప్రదాయ గోవా వంటకాలైన చేపలు, ఇతర సీ-ఫుడ్ను విక్రయించాలని, సరైన తినుబండారాలు లేకపోవడం వల్లే టూరిస్టులు రావడం లేదని వివరణ ఇచ్చారు.