Israel-Iran Tensions: ఉద్రిక్తతల మధ్య మోదీకి బెంజమిన్ నెతన్యాహు ఫోన్
ABN , Publish Date - Jun 13 , 2025 | 09:00 PM
ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు భీకర దాడులు జరిపింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ ఆయన ప్రధాని మోదీ ఫోన్ చేశారు.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendr MOdi)కి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) శుక్రవారం నాడు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మోదీ తెలియజేశారు.
'ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని ఆయన వివరించారు. భారత్ ఆందోళనను, పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయనతో ప్రస్తావించా' అని మోదీ ఆ ట్వీట్లో తెలిపారు.
ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు భీకర దాడులు జరిపింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పలువురు ఇరాన్ మిలటరీ సీనియర్ కమాండర్లు, ఆరుగురు అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖొమేని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అమెరికా షాకింగ్ నిర్ణయం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి