Ayodhya: అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు.. 200 శాతం వరకూ పెరుగుదల
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:34 PM
రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి.

అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భవ్యరామాలయ నిర్మాణంతో భూముల లావాదేవీలు, మార్కెట్ విలువ అమాతం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు అక్కడి భూముల సర్కిల్ రేట్లకు తాజాగా రెక్కలు వచ్చాయి. భూముల సర్కిల్ రేట్లను 30 నుంచి 200 శాతం వరకూ పెంచారు. గత ఎనిమిదేళ్లలో భూముల రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. కొత్త రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి. 2004 సెప్టెంబర్లో భూముల ధరల పెంపు కోరుతూ ఒక ప్రతిపాదన తమకు రావడంతో సవరించిన రేట్లను అమల్లోకి తెచ్చినట్టు సదర్ (ఫైజాబాద్) సబ్ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే తెలిపారు. కొత్త సర్కిల్ రేట్లకు జిల్లా మెజిస్ట్రేట్ ఆమోదం తెలుపడంతో ఇప్పుడు అమల్లోకి తెచ్చామని చెప్పారు. కొత్త రేట్ల ప్రకారం జిల్లాలోని రాకాబ్గంజ్, దేవ్కాళి ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరుగుతాయన్నారు. అయోధ్య ఆధ్యాత్మక పర్యటనా కేంద్రంగా అందరినీ ఆకర్షిస్తుండటం, మౌలిక వసతు కల్పన కారణంగా రామాలయం చుట్టూ ఉన్న సర్కిల్ రేట్లు చదరపు మీటరుకు రూ.26,660 నుంచి రూ.27,900 వరకూ పెరుగుతుందని చెప్పారు. గతంలో ఈ రేటు రూ.6,650 నుంచి రూ.6,975 వరకూ ఉండేది. ల్యాండ్ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ అనే కేటిగిరిల కింద వివిధ రేట్లలో భూముల పెరుగుదల ఉంటుందని చౌబే వివరించారు.
కాగా, భూముల రేట్లలో పెరుగుదల వల్ల స్టాంప్ డ్యూటీ పెరుగుతుందని, అయితే భూముల అధికారిక విలువ పెరగడం వల్ల భూముల యజమానులకు లబ్ధి కలుగుతుందని, రుణ పరిమితి పెరగుతుందని రియల్ ఎస్టేల్ డవలపర్ వివేక్ అగర్వాల్ అన్నారు. ఆస్తి లావాదేవీలు తక్కువ విలువ జరుగకుండా పన్ను ఎగవేతను ఆపవచ్చని విశ్లేషించారు.
11 ఏళ్ల మోదీ పాలన స్వర్ణయుగం: అమిత్షా
వర్తమానం ఊసెత్తకుండా 2047 గురించి కలలా?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి