Amit Shah: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి కశ్మీర్కు అమిత్ షా
ABN , Publish Date - May 29 , 2025 | 10:33 AM
Amit Shah: రెండు రోజుల జమ్మూ కశ్మీర్ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వెళ్లనున్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్ర కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించనున్నారు.

న్యూడిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం జమ్మూ కశ్మీర్ పర్యటనకు (Jammu Kashmir Visit) వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తరువాత మొదటిసారి ఆయన కశ్మీర్కు వెళుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం అక్కడ పర్యటించిన హోం మంత్రి.. గురు, శుక్రవారాల్లో జమ్మూ, పూంచ్లో పర్యటించనున్నారు. అమిత్ షా రెండు రోజుల పర్యటనలో జాతీయ భద్రత, సరిహద్దుల్లో పరిస్థితులపై స్థానిక పోలీస్ యంత్రాంగం, భద్రతాదళాలతో సమీక్షించనున్నారు. జూలైలో ప్రారంభంకానున్న అమర్నాథ్ యాత్రకు భద్రతా సన్నద్థతను అమిత్ షా సమీక్షించనున్నారు. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన హిందూ తీర్థయాత్రలలో అమర్నాథ్ యాత్ర ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాద బెదిరింపుల దృష్ట్యా, యాత్రికుల భద్రత.. తీర్థయాత్రలను సజావుగా నిర్వహించడానికి తీసుకుంటున్న భద్రతా చర్యలపై కూడా అమిత్ షా సమీక్షిస్తారు.
కాగా ఇటీవల కశ్మీర్లో జరిగిన ఉగ్ర కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అమిత్ షా స్వయంగా పరామర్శించనున్నారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడా అమిత్ షా భేటీ అవుతారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన సమయంలో ధర్మస్థలాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల నేపథ్యంలో, అమిత్ షా అక్కడి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించనున్నారు.
Also Read: ఐదు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం
గత నెల 23న పహల్గామ్లోని బైసరన్ టూరిజం స్పాట్ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఇటీవల అమిత్ షా పరామర్శించారు. బాధితుల కుటుంబాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆయన కశ్మీర్ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఉగ్రవాదంపై భారత్ మౌనంగా ఉండదని, పహల్గామ్ దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టమని, దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను దెబ్బతీయాలని చూస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని అమిత్ షా హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ సొంత జిల్లాలో టీడీపీ సైన్యం సత్తా..
ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు...
For More AP News and Telugu News