Air India Accident First Video: ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో దృశ్యాలు..
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:32 PM
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ రోజు జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంచలనంగా మారింది. 242 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులున్న ఈ విమానంలో 35 మందికిపైగా మృతి చెందిన ఘటన అనేక మందిని కలవర పరిచింది. ఈ క్రమంలో ప్రమాద స్థలం నుంచి వెలువడిన తొలి దృశ్యాలు (Air India Accident First Video) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గుజరాత్లోని (gujarat) అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉండగా, 35 మందికిపైగా మృతి చెందారని ఇప్పటివరకు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రమాద స్థలం నుంచి మొదటి దృశ్యాలు (Air India Accident First Video) వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలలో విమానం కూలిన తర్వాత పెద్ద ఎత్తున పొగలు రావడం కనిపిస్తుంది. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఈ విమానం అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది.
విమానంలో 169 మంది ఇండియన్స్
అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు వెళ్తున్న AI171 విమానం ఈరోజు టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయిందని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఇది మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు, 7 మంది పోర్చుగీస్ పౌరులున్నారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం కారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం ప్రయాణికులకు అందుబాటులో ఉండదని అక్కడి (SVPIA) ప్రతినిధి తెలిపారు. తర్వాత నోటీస్ వచ్చేవరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బాధితులకు సత్వర వైద్య సహాయం అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..
For National News And Telugu News