AIADMK: నీట్పై సీఎం క్షమాపణ చెప్పాలి..
ABN , Publish Date - May 03 , 2025 | 12:20 PM
నీట్ వ్యవహారంపై విద్యార్ధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా అధికార డీఎంకే పార్టీ 525 హామీలు ఇచ్చిందని, వాటిలో 15 శాతం కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

- అన్నాడీఎంకే డిమాండ్
చెన్నై: నీట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే(AIADMK) డిమాండ్ చేసింది. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ ప్రిసీడియం చైర్మెన్ తమిళ్ మగన్ హుస్సేన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. 375 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశం మొత్తం 16 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ వార్తను కూడా చదవండి: Hero Ajith: పొలిటికల్ ఎంట్రీపై హీరో అజిత్ ఆసక్తికర కామెంట్స్..
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట్ర నిర్వాహకులు కేపీ మునిస్వామి, నత్తం విశ్వనాధన్, ఎస్పీ వేలుమణి, దిండుగల్ శ్రీనివాసన్ మాజీమంత్రులు సెంగోటయ్యన్, డి.జయకుమార్ తదితరులు తీర్మానాలను సభకు వినిపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిని ఇంటికి సాగనంపాలన్న ఏకైక లక్ష్యంతో అన్నాడీఎంకే సారథ్యంలో మెగా కూటమి ఏర్పడేందుకు కృషిచేసిన ఈపీఎస్ను ఈ సమావేశం అభినందించింది.
2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రప్రజలకు డీఎంకే 525 హామీలు ఇచ్చిందని, వాటిలో 15 శాతం కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తంచేసింది. నీట్ రద్దు వ్యవహారంలో కపటనాటకం ఆడుతున్న డీఎంకే ప్రభుత్వం రాష్ట్రప్రజలకు, విద్యార్థిలోకానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది.
15వ తీర్మానంలో అన్నాడీఎంకే వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలిత బాటలో పయణిస్తూ పార్టీలో ఐక్యతను పెంచుతూ బలోపేతం చేస్తున్న ఈపీఎ్సను 2026వ సంవత్సరంలో మళ్ళీ సీఎంను చేయాలని, ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఈ సమావేశం కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్పోర్టు.. బసంత్నగర్లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and National News