Air India Plance Crash: విమానం తోక భాగంలో మరో మృతదేహం
ABN , Publish Date - Jun 14 , 2025 | 02:45 PM
ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.

అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తుండగా శనివారంనాడు మరో మృతదేహం లభ్యమైంది. విమానం తోక భాగంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. ఇది ఎయిర్ హోస్టెస్ మృతదేహంగా అధికారులు చెబుతున్నారు.
అలహాబాద్ నుంచి లండన్కు గత గురువారంనాడు బయలుదేరిన ఏఐ-171 (బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్) విమానం టేకాఫ్ అయిన 33 సెకన్లలోనే కుప్పకూలింది. విమానాశ్రయం సమీపంలోని మెఘాని నగర్ ఏరియాలో మెడికల్ కాలేజీ సమీపంలోని డాక్టర్స్ హాస్టల్ రూఫ్టాప్పై విమానం కుప్పకూలింది. దీంతో విమానంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణిస్తుండగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు. విమానం తోక భాగం భవనంపైనే చిక్కుకుపోయింది. మృతులలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటిన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ ప్రజలు, ఒక కెనడియన్ ఉన్నారు. విమానంలోని 11ఏ సీటు దగ్గర కూర్చున్న బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడ్డారు..
ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్, స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఎన్ఐఏ అధికారులు సైతం శుక్రవారంనాడు ప్రమాద స్థలిని సందర్శించారు.
ఇవి కూడా చదవండి..
15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి