Ramads: ఏజ్... నెంబర్కు మాత్రమే..
ABN , Publish Date - May 22 , 2025 | 01:28 PM
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు రాందాస్. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్గా మారాయి. ఇక వివరాల్లోకి వెళితే...

- 87 ఏళ్లలోనూ ఉత్సాహంగా ఈతకొడుతున్న రాందాస్
చెన్నై: తైలాపురం తోటలోని ఈత కొలనులో పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ 87 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్(Ramdas), ఆయన కుమారుడు డాక్టర్ అన్బుమణి మధ్య కొంతకాలంగా విబేధాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Covid: కరోనా లక్షణాలుంటే క్వారంటైన్లో ఉండాల్సిందే..
ప్రస్తుతం దిండివనం జిల్లా తైలాపురం తోటలో ఉంటున్న డా.రాందాస్, అక్కడే పార్టీ యువజన, మహిళా విభాగం, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో తైలాపురం తోటలో ఉన్న ఈత కొలనులో రాందాస్ ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి గంట సేపు ఈత కొడుతూ వ్యాయామం చేస్తుంటారు. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఈతకొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలువడ్డాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి
Read Latest Telangana News and National News