Leopards: బెంగళూరు పరిసరాల్లో 85 చిరుతలు
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:58 PM
బెంగళూరు నగర పరిసరాలలో 85 చిరుతలు ఉన్నట్లు పర్యావరణ నిపుణుడు డాక్టర్ సంజయ్గుబ్బి నేతృత్వంలోని హోళిమత్తె నేచర్ ఫౌండేషన్ బృందం అధ్యయనంలో గుర్తించింది. కెమెరా ట్రాప్ల ఆధారంగా ఏడాదిపాటు అధ్యయనం చేశారు.

- కెమెరా ట్రాప్ల ద్వారా గణన
- ఇతర వన్యప్రాణులూ సంచారం
- నేచర్ ఫౌండేషన్ బృందం వెల్లడి
బెంగళూరు: బెంగళూరు(Bengaluru) నగర పరిసరాలలో 85 చిరుతలు ఉన్నట్లు పర్యావరణ నిపుణుడు డాక్టర్ సంజయ్గుబ్బి నేతృత్వంలోని హోళిమత్తె నేచర్ ఫౌండేషన్ బృందం అధ్యయనంలో గుర్తించింది. కెమెరా ట్రాప్ల ఆధారంగా ఏడాదిపాటు అధ్యయనం చేశారు. 80-85 చిరుతలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రధానంగా బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం, యూఎం కావల్, తురహళ్ళి, సూలికెరె, తురహళ్ళిగుడ్డ, హెసరఘట్ట, మారసంద్ర, మండూరుతోపాటు 282 చదరపు కిలోమీటర్ల పరిధిలో వీరు అధ్యయనం చేశారు.
బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలో 54, బెంగళూరు సరిసరాల్లో 30 చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. చిరుతలతోపాటు ఇతర వన్యప్రాణులు కూడా సంచరిస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ అధ్యయన నివేదికను గురువారం ప్రకటించారు. 4 చిరుతలు ప్రమాదంలో ఉన్నట్లు 27 వన్యజీవి సంరక్షణకేంద్రంలో రక్షించారు. దీన్నిబట్టి బెంగళూరు పరిసరాలలో వన్యజీవుల నైసర్గిక ప్రదేశాలను సంరక్షించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఈ అధ్యయనంలో పలు సిఫారసులను చేశారు. వన్యజీవి, ఇతర ప్రాణుల సంరక్షణకోసం రిజర్వు ప్రదేశాన్ని ప్రకటించాలని దుర్గదకల్, బెట్టహళ్ళివాడలో కేటాయించిన అటవీప్రదేశాన్ని సంరక్షించాలని నివేదికలో సూచించారు.
బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం పరిధిలోకి జేఐ బాచహళ్ళి, ఎం మనియంబల్ ప్రదేశాలను చేర్చాలని సూచించారు. మునేశ్వరబెట్ట - బన్నేరుఘట్ట వన్యజీవి సంరక్షణ కారిడార్ సంరక్షణకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బంధించిన చిరుతలను బన్నేరుఘట్ట జూకు అప్పగించే ప్రక్రియను నిలిపివేయాలని సిఫారసు చేశారు. చిరుతలు అటవీ ప్రాంతాల్లో ఉండనివ్వాలని, వాటిని బంధించి కట్టడి చేయాలనుకోవడం సరికాదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News