Share News

Breaking News: జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభం: మంత్రి వాసంశెట్టి

ABN , First Publish Date - Jun 03 , 2025 | 11:12 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభం: మంత్రి వాసంశెట్టి
Breaking News

Live News & Update

  • Jun 03, 2025 17:59 IST

    ఏపీ కేబినెట్‌ భేటీ.. ఎప్పుడంటే..

    • రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ

    • రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై చర్చ

    • జీఏడీ ట‌వ‌ర్ టెండ‌ర్లకు అమోదం తెల‌ప‌నున్న కేబినెట్‌

    • HOD 4 ట‌వ‌ర్ల టెండ‌ర్లకు అమోదం తెల‌ప‌నున్న కేబినెట్‌

    • తల్లికి వంద‌నంపై కేబినెట్‌లో చర్చించే అవకాశం

    • అంత‌ర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అమోదం తెల‌ప‌నున్న కేబినెట్‌

  • Jun 03, 2025 17:59 IST

    రాజ్ కసిరెడ్డి పిటిషన్

    • విజయవాడ: లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి పిటిషన్

    • సబ్ జైలులో బ్లాక్ మార్చాలని కసిరెడ్డి పిటిషన్

    • పిటిషన్‌పై రేపు ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు

  • Jun 03, 2025 17:21 IST

    జగన్.. తెనాలి పరామర్శలో ట్విస్ట్..

    • రౌడీ షీటర్లను కాకుండా వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్

    • మూడ్రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన రౌడీషీటర్లు

    • నేటి వరకూ వారు ఇంటికి రాలేదని చెబుతున్న కుటుంబసభ్యులు

    • మంగళవారం విక్టర్, ఇతర నిందితుల కుటుంబసభ్యులను మాత్రమే పరామర్శించిన జగన్

    • రౌడీషీటర్లు ఎక్కడకు వెళ్లారనే అంశంపై ఆరా తీస్తున్న పోలీస్ అధికారులు

    • రౌడీషీటర్లను పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారని పెద్దఎత్తున విమర్శలు

    • దీంతో వారిని ముందే అక్కడ లేకుండా పంపించేశారా? అనే అంశంపై ఆరా తీస్తున్న పోలీసు వర్గాలు

  • Jun 03, 2025 16:59 IST

    బనకచర్ల ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్నాం: మంత్రి ఉత్తమ్

    • బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్

    • ఇప్పటికే జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో మాట్లాడాం: మంత్రి ఉత్తమ్

    • ప్రాజెక్ట్ నిర్మించకుండా అడ్డుకోవాలని కోరాం: మంత్రి ఉత్తమ్

    • మా అభ్యంతరాలను ఇప్పటికే కేంద్రానికి తెలియజేశాం: మంత్రి ఉత్తమ్

    • GRMB, కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖలు రాశాం: మంత్రి ఉత్తమ్

    • ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తాం: మంత్రి ఉత్తమ్

  • Jun 03, 2025 16:40 IST

    జగన్ బ్రతుకే వెన్నుపోటు..

    • జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభం: మంత్రి వాసంశెట్టి

    • వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక‌ స్థానం జగన్ కే సొంతం

    • చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా?: మంత్రి వాసంశెట్టి

    • తుని రైలు ఘటనపై గత ప్రభుత్వ హయాంలో కులాల మధ్య కుంపటి పెట్టారు: మంత్రి వాసంశెట్టి

  • Jun 03, 2025 16:40 IST

    మాజీ మంత్రి కేసు.. ముగిసిన వాదనలు..

    • నెల్లూరు: కాకాణి పోలీస్ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన ఇరుపక్షాల వాదనలు

    • కస్టడీ పిటిషన్, బెయిల్‌ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం

    • కాకాణిని కస్టడీకి తీసుకుంటే కేసులో పూర్తి వివరాలు తెలుస్తాయి: డీఎస్పీ ఘటమనేని

    • కోర్టులో ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారు: డీఎస్పీ ఘటమనేని

    • పోలీస్ కస్టడీ ఇస్తారన్న నమ్మకం ఉంది: డీఎస్పీ ఘటమనేని

  • Jun 03, 2025 13:53 IST

    తుని కేసులో బిగ్ ట్విస్ట్..

    • తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం.

    • తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లే యోచన లేదని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం.

    • తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను.. తక్షణమే రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశం.

    • ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై ఆరా.

    • కేసుపై RPG సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన.. ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టు గుర్తింపు.

    • ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులకు హెచ్చరిక.

    • జీవో రద్దు చేస్తూ కాసేపట్లో వెలువడనున్న ఉత్తర్వులు.

  • Jun 03, 2025 13:14 IST

    ముగ్గురు అధికారులపై జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్‌సిన్హా వేటు

    • ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగించిన ఎల్జీ.

    • లష్కర్ ఎ తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు.. గూఢచారులుగా పనిచేస్తున్నట్లు అధికారులపై ఆరోపణలు.

    • పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులకు సాయం చేసినట్టు అనుమానం.

    • ముగ్గురు అధికారులను ప్రశ్నిస్తోన్న పోలీసులు.

    • ఇప్పటివరకు 75 మంది ప్రభుత్వ అధికారులకు.. ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన నిఘా సంస్థలు.

  • Jun 03, 2025 13:09 IST

    క్షమాపణే వివాదానికి పరిష్కారం: కర్ణాటక హైకోర్టు

    • కమల్‌ హాసన్‌ను ఉద్దేశించి కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలు

    • ఏ ఆధారాలతో మాట్లాడారని కమల్‌ను ప్రశ్నించిన హైకోర్టు

    • తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఇటీవల కమల్‌ వ్యాఖ్యలు

  • Jun 03, 2025 12:28 IST

    ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

    • ఈనెల 17 వరకు రిమాండ్‌ పొడిగించిన విజయవాడ కోర్టు

    • లిక్కర్‌ కేసు నిందితులుగా రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య.

    • దిలీప్‌, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప

  • Jun 03, 2025 11:49 IST

    టీబీజేపీలో కలకలం రేపుతున్న రాజాసింగ్‌ ఎపిసోడ్‌

    rajasingh-mla.jpg

    • రాజాసింగ్‌ బలం, బలగంపై పార్టీ అధిష్టానం ఆరా

    • రాజాసింగ్‌పై పార్టీ తీసుకోబోయే చర్యలపై ఆసక్తి

    • నోటీసులు కాదు.. సస్పెండ్‌ చేయండంటూ రాజాసింగ్‌ సవాల్‌

    • రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్‌

    • రాజాసింగ్‌పై చర్యలకు సిద్ధమవుతున్న పార్టీ అధిష్టానం

  • Jun 03, 2025 11:37 IST

    తెనాలిలో వైఎస్‌ జగన్‌ పర్యటనపై నిరసనలు

    • జగన్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాల రాస్తారోకో.

    • తెనాలి మార్కెట్‌ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఆందోళన.

    • వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను పరామర్శించని జగన్‌.

    • రౌడీషీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ నినాదాలు.

    • ఐతానగర్‌ సెంటర్‌లో జగన్‌ను అడ్డుకున్న MRPS కార్యకర్తలు.

  • Jun 03, 2025 11:22 IST

    నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

    • 500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌

    • 100 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ

  • Jun 03, 2025 11:17 IST

    తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సర్వేలు

    • కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కోసం సర్వేలు.

    • ప్రజల దగ్గరకే రెవెన్యూ నినాదంతో సమస్యల పరిష్కారం.

    • ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో సర్వే ప్రారంభించిన భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి.

  • Jun 03, 2025 11:12 IST

    ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కోర్టుకు ఏడుగురు నిందితులు

    • లిక్కర్‌ స్కాం కేసులో నిందితులకు ముగిసిన రిమాండ్‌.

    • లిక్కర్‌ కేసు నిందితులుగా రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య.

    • దిలీప్‌, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప.

  • Jun 03, 2025 11:12 IST

    కాళేశ్వరం విషయంలో ఇరిగేషన్‌ అధికారుల్లో హైటెన్షన్‌

    • విజిలెన్స్ రిపోర్ట్, NDSA నివేదిక సహా.. పీసీ ఘోష్ కమిషన్ విచారణతో హడలిపోతున్న అధికారులు.

    • 57 మంది అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు.

    • 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు సహా.. 33 మంది అధికారులపై జరిమానా విధించాలని విజిలెన్స్ సూచన.

    • ఇప్పటికే ప్రభుత్వానికి NDSA, విజిలెన్స్‌ కమిషన్‌ నివేదికలు.

    • జులై ఆఖరుకు నివేదిక ఇవ్వనున్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్.

    • కమిషన్ నివేదిక తర్వాత చర్యలు తీసుకోనున్న టీజీ ప్రభుత్వం.