-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates 3rd June 2025 Top news and Major Events Across India Siva
-

Breaking News: జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభం: మంత్రి వాసంశెట్టి
ABN , First Publish Date - Jun 03 , 2025 | 11:12 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jun 03, 2025 17:59 IST
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ
జీఏడీ టవర్ టెండర్లకు అమోదం తెలపనున్న కేబినెట్
HOD 4 టవర్ల టెండర్లకు అమోదం తెలపనున్న కేబినెట్
తల్లికి వందనంపై కేబినెట్లో చర్చించే అవకాశం
అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అమోదం తెలపనున్న కేబినెట్
-
Jun 03, 2025 17:59 IST
రాజ్ కసిరెడ్డి పిటిషన్
విజయవాడ: లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి పిటిషన్
సబ్ జైలులో బ్లాక్ మార్చాలని కసిరెడ్డి పిటిషన్
పిటిషన్పై రేపు ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు
-
Jun 03, 2025 17:21 IST
జగన్.. తెనాలి పరామర్శలో ట్విస్ట్..
రౌడీ షీటర్లను కాకుండా వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్
మూడ్రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన రౌడీషీటర్లు
నేటి వరకూ వారు ఇంటికి రాలేదని చెబుతున్న కుటుంబసభ్యులు
మంగళవారం విక్టర్, ఇతర నిందితుల కుటుంబసభ్యులను మాత్రమే పరామర్శించిన జగన్
రౌడీషీటర్లు ఎక్కడకు వెళ్లారనే అంశంపై ఆరా తీస్తున్న పోలీస్ అధికారులు
రౌడీషీటర్లను పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారని పెద్దఎత్తున విమర్శలు
దీంతో వారిని ముందే అక్కడ లేకుండా పంపించేశారా? అనే అంశంపై ఆరా తీస్తున్న పోలీసు వర్గాలు
-
Jun 03, 2025 16:59 IST
బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్నాం: మంత్రి ఉత్తమ్
బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్
ఇప్పటికే జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో మాట్లాడాం: మంత్రి ఉత్తమ్
ప్రాజెక్ట్ నిర్మించకుండా అడ్డుకోవాలని కోరాం: మంత్రి ఉత్తమ్
మా అభ్యంతరాలను ఇప్పటికే కేంద్రానికి తెలియజేశాం: మంత్రి ఉత్తమ్
GRMB, కేంద్ర జల్శక్తి మంత్రికి లేఖలు రాశాం: మంత్రి ఉత్తమ్
ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తాం: మంత్రి ఉత్తమ్
-
Jun 03, 2025 16:40 IST
జగన్ బ్రతుకే వెన్నుపోటు..
జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభం: మంత్రి వాసంశెట్టి
వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక స్థానం జగన్ కే సొంతం
చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా?: మంత్రి వాసంశెట్టి
తుని రైలు ఘటనపై గత ప్రభుత్వ హయాంలో కులాల మధ్య కుంపటి పెట్టారు: మంత్రి వాసంశెట్టి
-
Jun 03, 2025 16:40 IST
మాజీ మంత్రి కేసు.. ముగిసిన వాదనలు..
నెల్లూరు: కాకాణి పోలీస్ కస్టడీ పిటిషన్పై ముగిసిన ఇరుపక్షాల వాదనలు
కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్పై ఎల్లుండి తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం
కాకాణిని కస్టడీకి తీసుకుంటే కేసులో పూర్తి వివరాలు తెలుస్తాయి: డీఎస్పీ ఘటమనేని
కోర్టులో ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారు: డీఎస్పీ ఘటమనేని
పోలీస్ కస్టడీ ఇస్తారన్న నమ్మకం ఉంది: డీఎస్పీ ఘటమనేని
-
Jun 03, 2025 13:53 IST
తుని కేసులో బిగ్ ట్విస్ట్..
తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం.
తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం.
తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను.. తక్షణమే రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశం.
ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై ఆరా.
కేసుపై RPG సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన.. ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టు గుర్తింపు.
ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులకు హెచ్చరిక.
జీవో రద్దు చేస్తూ కాసేపట్లో వెలువడనున్న ఉత్తర్వులు.
-
Jun 03, 2025 13:14 IST
ముగ్గురు అధికారులపై జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్సిన్హా వేటు
ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగించిన ఎల్జీ.
లష్కర్ ఎ తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు.. గూఢచారులుగా పనిచేస్తున్నట్లు అధికారులపై ఆరోపణలు.
పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులకు సాయం చేసినట్టు అనుమానం.
ముగ్గురు అధికారులను ప్రశ్నిస్తోన్న పోలీసులు.
ఇప్పటివరకు 75 మంది ప్రభుత్వ అధికారులకు.. ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన నిఘా సంస్థలు.
-
Jun 03, 2025 13:09 IST
క్షమాపణే వివాదానికి పరిష్కారం: కర్ణాటక హైకోర్టు
కమల్ హాసన్ను ఉద్దేశించి కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలు
ఏ ఆధారాలతో మాట్లాడారని కమల్ను ప్రశ్నించిన హైకోర్టు
తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఇటీవల కమల్ వ్యాఖ్యలు
-
Jun 03, 2025 12:28 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగించిన విజయవాడ కోర్టు
లిక్కర్ కేసు నిందితులుగా రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, చాణక్య.
దిలీప్, ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప
-
Jun 03, 2025 11:49 IST
టీబీజేపీలో కలకలం రేపుతున్న రాజాసింగ్ ఎపిసోడ్
రాజాసింగ్ బలం, బలగంపై పార్టీ అధిష్టానం ఆరా
రాజాసింగ్పై పార్టీ తీసుకోబోయే చర్యలపై ఆసక్తి
నోటీసులు కాదు.. సస్పెండ్ చేయండంటూ రాజాసింగ్ సవాల్
రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్
రాజాసింగ్పై చర్యలకు సిద్ధమవుతున్న పార్టీ అధిష్టానం
-
Jun 03, 2025 11:37 IST
తెనాలిలో వైఎస్ జగన్ పర్యటనపై నిరసనలు
జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాల రాస్తారోకో.
తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఆందోళన.
వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ను పరామర్శించని జగన్.
రౌడీషీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ నినాదాలు.
ఐతానగర్ సెంటర్లో జగన్ను అడ్డుకున్న MRPS కార్యకర్తలు.
-
Jun 03, 2025 11:22 IST
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
500 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
100 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ
-
Jun 03, 2025 11:17 IST
తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సర్వేలు
కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కోసం సర్వేలు.
ప్రజల దగ్గరకే రెవెన్యూ నినాదంతో సమస్యల పరిష్కారం.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో సర్వే ప్రారంభించిన భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి.
-
Jun 03, 2025 11:12 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కోర్టుకు ఏడుగురు నిందితులు
లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ముగిసిన రిమాండ్.
లిక్కర్ కేసు నిందితులుగా రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, చాణక్య.
దిలీప్, ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప.
-
Jun 03, 2025 11:12 IST
కాళేశ్వరం విషయంలో ఇరిగేషన్ అధికారుల్లో హైటెన్షన్
విజిలెన్స్ రిపోర్ట్, NDSA నివేదిక సహా.. పీసీ ఘోష్ కమిషన్ విచారణతో హడలిపోతున్న అధికారులు.
57 మంది అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు.
17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు సహా.. 33 మంది అధికారులపై జరిమానా విధించాలని విజిలెన్స్ సూచన.
ఇప్పటికే ప్రభుత్వానికి NDSA, విజిలెన్స్ కమిషన్ నివేదికలు.
జులై ఆఖరుకు నివేదిక ఇవ్వనున్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్.
కమిషన్ నివేదిక తర్వాత చర్యలు తీసుకోనున్న టీజీ ప్రభుత్వం.