Share News

US Speaker Mike Johnson: వనరులిస్తాం ఉగ్రవాదంపై పోరాడండి

ABN , Publish Date - May 07 , 2025 | 05:34 AM

అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు శక్తి మరియు వనరులను అందిస్తామని ప్రకటించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, భారత్‌కు మద్దతు ఇవ్వాలని అన్నారు.

US Speaker Mike Johnson: వనరులిస్తాం ఉగ్రవాదంపై పోరాడండి

వాషింగ్టన్‌, మే 6: ఉగ్రవాదంపై పోరులో భారతదేశానికి శక్తిని, వనరులను అందిస్తామని అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ప్రకటించారు. సోమవారం క్యాపిటల్‌ హిల్‌లో ఆయన మాట్లాడుతూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అన్ని విధాలా మద్దతును అమెరికా అందిస్తుందని చెప్పారు. ‘భారత్‌తో సంబంధాల ప్రాముఖ్యతను ట్రంప్‌ యంత్రాంగం గుర్తించింది. అలాగే, ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్న ముప్పును కూడా ట్రంప్‌ యంత్రాంగం గుర్తించింది. భారత్‌కు ఇప్పుడు మరింత శక్తిని, వనరులను అందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అన్నారు.

Updated Date - May 07 , 2025 | 05:34 AM