Trump: యాపిల్పై 25%.. ఈయూపై 50%
ABN , Publish Date - May 24 , 2025 | 05:02 AM
చైనాపై సుంకాలు పెంచిన నేపథ్యంలో తన తయారీని భారత్కు మార్చే ప్రయత్నాల్లో ఉన్న యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలో తయారుచేయకపోతే వాటిపై 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు.

ఆగని ట్రంప్ సుంకాల రంకెలు
అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారుచేయాలి
భారత్లో కానీ.. మరెక్కడైనా కానీ తయారు చేయవద్దని హుకుం
జూన్ 1 నుంచి ఈయూ ఉత్పత్తులపై 50ు టారిఫ్ అని హెచ్చరిక
వాషింగ్టన్, మే 23: చైనాపై సుంకాలు పెంచిన నేపథ్యంలో తన తయారీని భారత్కు మార్చే ప్రయత్నాల్లో ఉన్న యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలో తయారుచేయకపోతే వాటిపై 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. దీనిపై తాను ఇప్పటికే యాపిల్ సీఈవో టిమ్ కుక్కు సమాచారం ఇచ్చానని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘నేను చాలా కాలం క్రితమే యాపిల్ సీఈవో టిమ్ కుక్కు సమాచారం ఇచ్చాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లు యూఎ్సఏలోనే తయారుకావాలి తప్ప ఇండియాలోనో, మరోచోటో కాదనే విషయాన్ని ఆయనకు చెప్పాను. అలా చేయకపోతే కనీసం 25ు సుంకాన్ని యాపిల్ అమెరికాకు చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. వచ్చే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ఐఫోన్లలో 25 శాతం ఫోన్లను భారత్లో తయారుచేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ సంస్థ 22 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.87 లక్షల కోట్లు) విలువ చేసే ఐఫోన్లను యాపిల్ సంస్థ భారత్లో ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 60 శాతం దాకా ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్లోనే తయారవుతోంది. యాపిల్పై సుంకాల హెచ్చరికతో పోస్టు పెట్టిన అరగంటకే.. ట్రంప్ తన సుంకాల అస్త్రాన్ని ఈయూపై గురిపెట్టారు. అమెరికాతో వాణిజ్య చర్చలకు రాని కారణంగా జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను సిఫారసు చేస్తున్నట్టు మరో పోస్టు పెట్టారు. ఈయూతో వ్యవహారం కష్టంగా ఉందని.. తమ మధ్య చర్చలు ముందుకు సాగట్లేదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పోస్టుల దెబ్బకు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్ కుదేలైంది. అటు ఈయూ స్టాక్ మార్కెట్లు కూడా 2ు మేర పతనమయ్యాయి.