Pakistan: రక్షణ రంగం బడ్జెట్ 18 శాతం పెంచిన పాక్
ABN , Publish Date - May 06 , 2025 | 06:03 PM
దాదాపు రూ.17.5 ట్రిలియన్లతో కొత్త బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం పీపీపీతో షేర్ చేసుకుందని, అందులో రక్షణ వ్యయాన్ని 18 శాతానికి పెంచేందుకు అంగీకరించిందని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.

ఇస్లామాబాద్: అర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగం బడ్జెట్ను 18 శాతం పెంచుతూ పాక్ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారంనాడు నిర్ణయం తీసుకుంది. కొత్త బడ్జెట్లో రక్షణరంగంపై రూ.2.5 ట్రిలియన్స్ వెచ్చేందుకు ఆమోదం తెలిపినట్టు మీడియా కథనాలు వెలవడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో పాక్ సర్కార్ తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Islamabad: భారత్తో యుద్ధం ఇస్లామిక్ వార్ కాదు... ఇస్లామిక్ క్లెరిక్ ఘాజి
జూలై 1వ తేదీ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో 2025-26 సంవత్సరం బడ్జెట్ను జూన్ మొదటి వారలో పాక్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ అంశాలపై మాట్లాడేందుకు పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆయన ఆర్థిక బృందంతో సోమవారంనాడు సమావేశమయినట్టు 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' తెలిపింది.
దాదాపు రూ.17.5 ట్రిలియన్లతో కొత్త బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం పీపీపీతో షేర్ చేసుకుందని, అందులో రక్షణ వ్యయాన్ని 18 శాతానికి పెంచేందుకు అంగీకరించిందని ఆ కథనం తెలిపింది. భారత్తో ఇటీవల కాలంలో ఉద్రికతలు పెరగడంతో రక్షణ బడ్జెట్ పెంచే విషయంలో పీఎంఎల్-ఎన్, పీపీపీ మధ్య ఏకాభిప్రాయం కుదరిందని, పీఎంఎల్-ఎన్ ప్రతిపాదకను పీపీపీ మద్దతు తెలిపిందని పేర్కొంది. ప్రస్తుత 2024-2025 బడ్జెట్లో రూ.2,122 బిలియన్లు రక్షణరంగానికి కేటాయించగా, అది 2023-24లో 1,804 బిలియన్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి..