Share News

Canada India Trade: కొత్త శకం ప్రారంభం.. కెనడా కొత్త ప్రభుత్వం భారత్‌తో వ్యాపారానికి సన్నద్ధం

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:54 PM

భారతదేశం-కెనడా సంబంధాల విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Canada India Trade: కొత్త శకం ప్రారంభం.. కెనడా కొత్త ప్రభుత్వం భారత్‌తో వ్యాపారానికి సన్నద్ధం
Canada India trade relations

కెనడా ఎన్నికల ఫలితాల్లో లిబరల్ పార్టీ దాదాపు విజయం సాధించిందని చెప్పవచ్చు. దీంతో ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో భారతదేశం-కెనడా మధ్య సంబంధాలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. కెనడా పార్లమెంట్‌లోని 343 సీట్లలో లిబరల్ పార్టీ.. కన్జర్వేటివ్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లిబరల్ పార్టీ మెజారిటీకి ఐదు సీట్ల దూరంలో 167 సీట్ల లీడ్‎తో కొనసాగుతోంది.


కార్నీ ప్రాధాన్యత

మార్క్ కార్నీ, భారతదేశంతో సంబంధాలను పటిష్ఠం చేయాలనే తన ఆలోచనను వ్యక్తం చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఇలా అన్నారు. కెనడా-భారతదేశం సంబంధం చాలా ముఖ్యమైనవని, ఇది వ్యక్తిగత, ఆర్థిక, వ్యూహాత్మక స్థాయిలలో సంబంధాలను పెంచుతుందన్నారు. ఈ బంధం రెండు దేశాల మధ్య సహకారానికి బలమైన పునాదిగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచడంలో కార్నీ నిబద్ధతను సూచిస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపై ఇండియాకు సపోర్ట్ చేసేందుకు, సంబంధాలు కలుపుకునేందుకు మరో దేశం కూడా సిద్ధమైంది.


సున్నితమైన విషయంపై కార్నీ వైఖరి

ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో మార్క్ కార్నీ నేరుగా వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. మా వల్ల కలగని కొన్ని ఒడిదుడుకులు ఈ సంబంధంలో ఉన్నాయి. పరస్పర గౌరవంతో ముందుకు వెళ్లి వీటిని పరిష్కరించే మార్గం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు, గతంలో జస్టిన్ ట్రూడో నాయకత్వంలో నిజ్జర్ హత్య విషయంలో భారత ఏజెంట్లను బహిరంగంగా ఆరోపించడంతో దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దే దిశగా కార్నీ ఆలోచనలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో హయాంలో నిజ్జర్ హత్య విషయంలో రెండు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. అయితే, కార్నీ మాత్రం సున్నితమైన వైఖరి వివాదాన్ని సమర్థవంతంగా పరిష్కరించి, సంబంధాలను మెరుగుపరచడానికి సిద్ధమని ప్రకటించారు.


వాణిజ్య సంబంధాలలో కొత్త అవకాశాలు

భారతదేశం-కెనడా సంబంధాలలో అత్యంత ఆశాజనక రంగం వాణిజ్యం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కఠిన వాణిజ్య విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో, కెనడా తన వాణిజ్య భాగస్వాములను విస్తరించాలని చూస్తోంది. ఈ సందర్భంగా మార్క్ కార్నీ భారతదేశాన్ని కీలక భాగస్వామిగా గుర్తించారు. కెనడా తన వాణిజ్యాన్ని సారూప్యత కలిగిన దేశాలతో విస్తరించాలన్నారు. ఇందులో భారతదేశం ముఖ్యమైన భాగస్వామి కానుంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య నిలిచిపోయిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంచడానికి కీలక నిర్ణయంగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

కశ్మీర్‌లో ఐదో రోజూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్

వేడి నుంచి ఉపశమనం..ఈ ప్రాంతాల్లో మే 3 వరకు వర్షాలు..

మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Read More Latest Telugu News and National News

Updated Date - Apr 29 , 2025 | 03:20 PM