Share News

Israel Strikes Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి, మరో ఇద్దరు టాప్ జనరల్స్ మృతి.. మరో యుద్ధం తప్పదా..

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:23 PM

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధ భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున మిడిల్ ఈస్ట్‌లో చోటుచేసుకున్న దాడులు (Israel Strikes Iran) ఈ ప్రశ్నను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి. ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో మరో ఇద్దరు ప్రముఖ ఇరాన్ జనరల్స్ మృతి చెందారు.

Israel Strikes Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి, మరో ఇద్దరు టాప్ జనరల్స్ మృతి.. మరో యుద్ధం తప్పదా..
Israel Strikes Iran

ప్రపంచవ్యాప్తంగా మరో యుద్ధం జరుగబోతుందా? అంటే ఔననే అనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన దాడులు ప్రస్తుతం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇజ్రాయెల్ నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో (Israel Strikes Iran) మరో ఇద్దరు టాప్ ఇరానియన్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు టెల్ అవీవ్‌, జెరూసలేం నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇదంతా ఇరాన్ చేపట్టిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్‌కి బదులుగా ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల ఫలితమని చెప్పుకోవచ్చు.


ఇరాన్ టాప్ కమాండర్లకు వీడ్కోలు

ఈసారి ప్రాణాలు కోల్పోయినవారు సాధారణ ప్రజలు కాదు. ఇరాన్ సైనిక ఇంటెలిజెన్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్ అయిన జనరల్ గోలంరెజా మెహ్రాబీ, అలాగే ఆపరేషన్స్ విభాగ డిప్యూటీ హెడ్ అయిన జనరల్ మెహ్దీ రబ్బానీ. వీరిద్దరూ ఇజ్రాయెల్ బాంబు దాడులకు బలయ్యారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ వార్తను ధ్రువీకరించింది. దీంతోపాటు ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఫోర్డో అణు కేంద్రానికి సైతం నష్టం జరిగినట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.


అణుశక్తిపై దాడి టార్గెట్ (Israel Strikes Iran)

ఇజ్రాయెల్ దాడిలో అణుశక్తి కేంద్రం టార్గెట్ కావడం ఆ దేశ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. ఫోర్డో సైట్‌లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే స్వల్ప నష్టం జరిగిందని, ఇప్పటికే చాలా పరికరాలను అక్కడి నుంచి తరలించామని ఇరాన్ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో భవిష్యత్‌లో మరిన్ని దాడులు జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపించింది. మొదటి విడత దాడిలో 78 మందికి పైగా మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులున్నారు. దీంతోపాటు 300 మందికి పైగా గాయపడ్డారు.


ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారంటే..

టెహ్రాన్ నగరంపై మూడోసారి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, ఈ దాడిలో మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది. అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో చేపట్టిన భారీ క్షిపణుల దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 34 మందికి పైగా గాయపడ్డారు. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఛేదించిన ఈ దాడి ఇరాన్ సాంకేతిక సామర్థ్యాన్ని వెల్లడించింది. ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అన్నారు. ఇరాన్ అణుశక్తిని నిర్మూలించే వరకు మేము ఆగబోమన్నారు. ఈ వ్యాఖ్యలు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌ మరింత ఈజీ


For National News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 04:35 PM