Share News

Viral Video: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. మంటల్లో చిక్కుకున్న భవనాలు..

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:22 PM

ఇజ్రాయెల్‌ మరోసారి భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. ఇరాన్‌పై కొనసాగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో దాదాపు 200 యుద్ధ విమానాలు మోహరించబడి, 100కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలను కూల్చివేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Viral Video: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. మంటల్లో చిక్కుకున్న భవనాలు..
Israel Attack on Iran

ఇజ్రాయెల్‌ శుక్రవారం (జూన్ 13, 2025న) రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌పై (Israel Attack on Iran) భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 200 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు 100కి పైగా లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. వీటిలో నతాంజ్ అణు కేంద్రం, ఖోర్రమాబాద్, ఖొండాబ్, తాబ్రిజ్ వంటి కీలక సైనిక, అణు సదుపాయాల ప్రాంతాలు ఉన్నాయి. ఈ దాడిలో ఇరాన్‌ సైనిక అధికారి మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ, ప్రముఖ అణు శాస్త్రవేత్తలు ఫెరేయ్డూన్ అబ్బాసీ, మొహమ్మద్ మెహ్దీ తేహ్రాంచి సహా పలువురు మరణించారు.


దాడి కారణాలు, లక్ష్యాలు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకారం ఈ దాడులు ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవడానికి చేపట్టిన చర్యగా చెబుతున్నారు. ఇరాన్ 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కలిగి ఉంది. అంతేకాకుండా ఇరాన్‌ అణు ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఐఏఈఏ (IAEA) ఇటీవల ప్రకటించడంతో, ఇజ్రాయెల్‌ ఈ దాడిని అత్యవసర చర్యగా భావించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఈ దాడులు ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవడానికి కొనసాగుతాయని ప్రకటించారు. ఇరాన్‌ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రతిస్పందన చర్యలను చేపడతామని ప్రకటించింది. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో మరింత ఉద్రిక్తతలకు దారితీస్తాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.


దాడి ప్రభావం

ఈ దాడి కారణంగా టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించి మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలలో పెద్దపెద్ద భవనాలు కూలిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో పౌరులు, మహిళలు, పిల్లలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.


ఇరాన్ ప్రతిస్పందన

ఈ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ దాదాపు 100 డ్రోన్లను ఇజ్రాయెల్ వైమానిక సరిహద్దులకు పంపింది. ఈ డ్రోన్లను తమ సరిహద్దులలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం తెలిపింది. ఈ దాడులపై సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, లిబియా, సిరియా సహా పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడిలో తమ భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 09:03 PM